రాష్ట్రీయం

కల్యాణ రథం.. శ్రీవారికి విరాళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: తిరుమల శ్రీవారికి మంగళవారం కల్యాణ రథం విరాళంగా అందింది. నెల్లూరుకు చెందిన హర్ష టయోటా అధినేత హర్ష సుమారు 60 లక్షల రూపాయల విలువైన ఈ వాహనాన్ని అందించారు. శ్రీవారి ఆలయం ఎదుట కల్యాణ రథం బస్సుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వాహనం తాళాలను టీటీడీ తిరుమల జేఈఓ శ్రీనివాసరాజుకు దాత అందజేశారు. శ్రీనివాస కల్యాణాల నిర్వహణ కోసం ఈ కల్యాణ రథాన్ని టీటీడీ వినియోగించనుంది. ఈ కార్యక్రమంలో టీటీడీ ట్రాన్స్‌పోర్టు జనరల్ మేనేజర్ శేషారెడ్డి, డీఐ భాస్కర్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.