క్రైమ్/లీగల్

లారీ, ఆటో ఢీ: ముగ్గురి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విస్సన్నపేట, మే 14: కృష్ణా జిల్లా విస్సన్నపేట - నూజివీడు రోడ్డులో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. సెయింట్ థెరిస్సా బాలికోన్నత పాఠశాల వద్ద ఆటో, లారీ ఎదురెదురుగా ఢీకొనటంతో ఈ దుర్ఘటన జరిగింది. ఆటోడ్రైవర్ దుక్కిపాటి రాజారావు(40), ప్రయాణికురాలు జుంజునూరి లక్ష్మీకాంతమ్మ(42), నెల నిండని పసికందు అక్కడికక్కడే మృతి చెందారు. మృతురాలు లక్ష్మీకాంతమ్మ కుమార్తె ఒడిశాల ప్రేమలత, మరో ప్రయాణికుడికి తీవ్ర గాయాలయ్యాయి. వీరి పరిస్థితి విషమించటంతో మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. రెడ్డిగూడెం మండలం శ్రీరామపురం దళితవాడకు చెందిన జుంజునూరి లక్ష్మీకాంతమ్మ, ఆమె కుమార్తె ప్రేమలత మగబిడ్డను నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో చూపించేందుకు సోమవారం రాజారావు ఆటో కిరాయికి మాట్లాడుకున్నారు. నూజివీడు వెళ్లి ఆసుపత్రిలో చూపించుకుని తిరిగి ఇంటికి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. మరో 10 నిముషాల్లో తమ గ్రామం చేరనుండగా మృత్యువు లారీ రూపంలో ఎదురుగా వచ్చి వీరు ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొంది. రాజారావు, లక్ష్మీకాంతమ్మ ఆటోలోనే ఇరుక్కుపోయి మృతి చెందారు. పసికూన ఎగిరి కిందపడి కన్నుమూశాడు.

అమెరికాలో ఖమ్మం విద్యార్థి దుర్మరణం
ఖమ్మం, మే 14: ఖమ్మం జిల్లా మండల కేంద్రం తిరుమలాయపాలేనికి చెందిన విద్యార్థి కొండబాల పృధ్వి (21) అమెరికాలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఇతను మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొండబాల కరుణాకర్ - శ్రీలక్ష్మి దంపతుల కుమారుడు. ఓహియో రాష్ట్రంలోని ఫ్రాంక్లిన్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ విద్యనభ్యసిస్తున్న పృధ్వి ద్విచక్ర వాహనంపై వెళుతూ ప్రమాదవశాత్తూ డివైడర్‌ను ఢీకొన్నాడు. పక్కనే ఉన్న లోయలో పడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. రెండేళ్ల క్రితం ఉన్నత విద్యాభ్యాసానికి అమెరికా వెళ్లిన పృధ్వి త్వరలోనే సెలవుల్లో ఇంటికి రావలసి వుండిందని భోరున విలపిస్తూ కరుణాకర్ తెలిపారు. పృధ్వి మృతదేహాన్ని తానా సహకారంతో ఖమ్మం తరలించేందుకు ఎన్‌ఆర్‌ఐలు ఏర్పాట్లు చేస్తున్నారు.