రాష్ట్రీయం

రాజ్యాంగ విరుద్ధమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కందుకూరు, మే 17: కర్నాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తీరు రాజ్యాంగ విరుద్ధం అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. గురువారం ప్రకాశం జిల్లా కందుకూరులోని మార్కెట్‌యార్డులో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కర్నాటకలో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు కలిసి పూర్తి మెజార్టీ కలిగి ఉంటే, అప్రజాస్వామ్యకంగా, రాజ్యాంగ విలువలను అతిక్రమించి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సీట్లు లేకుండానే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి యెడ్యూరప్ప చేత ముఖ్యమంత్రిగా గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని చంద్రబాబు ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని అతిక్రమించి, విలువలకు పాతరేసి ఇలా అనైతికంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సబబు కాదో ప్రజలే తేల్చాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. రాజ్యాంగం ప్రకారం ప్రజలకు ఉన్న హక్కుల్ని కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందన్నారు. ప్రత్యేక హోదా కల్పిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి దాన్ని తుంగలో తొక్కిన బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటు వేయకూడదని తాము కర్నాటకలోని తెలుగువారిని కోరామని, తమ పిలుపునకు కొంత మేర వారి నుంచి స్పందన వచ్చిందని ఈ సందర్భంగా చంద్రబాబు స్పష్టం చేశారు. ఆంధ్ర ప్రదేశ్‌కు న్యాయ, చట్టబద్ధంగా రావాల్సిన హక్కుల్ని కల్పించకుండా బీజేపీ తన స్వార్థ పూరిత ప్రయోజనాల కోసం రాజకీయాలు చేస్తోందని బాబు అన్నారు. కొన్ని పార్టీలు కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి వ్యక్తుల్ని రెచ్చగొట్టి అరాచకాలకు
ప్రేరేపిస్తున్నాయన్నారు. కేంద్రం ప్రభుత్వం తమ రాష్ట్రానికి ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదు బీజేపీని నిలదీయడంతో పాటు తక్షణం న్యాయం చేయాల్సిందిగా వత్తిడి తీసుకురావాలని ప్రజల్ని చంద్రబాబు కోరారు. ఈ సందర్భంగా విపక్ష నేత జగన్‌పైనా చంద్రబాబు పరోక్షంగా నిప్పులు చెరిగారు. కేంద్రానికి సహకరించే వారిని రాష్ట్ర ద్రోహులుగా గుర్తించాలని జగన్‌కు చురకలు అంటించారు. ప్రస్తుతం రాష్ట్ర హక్కుల కోసం, న్యాయబద్ధమైన డిమాండ్ల కోసం పోరాడాల్సిన వ్యక్తులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్నారు. తమపై ఉన్న కేసుల్ని మాఫీ చేయించుకోవడం కోసం బీజేపీతో చేతులు కలిపి నీతివంతమైన పాలన చేస్తున్న తనపై విమర్శలు చేయడం తగదన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్ని పోరాటాలకైనా వెనుకాడబోనని చంద్రబాబు ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలోని 25 ఎంపీ సీట్లును కైవసం చేసుకుని కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో మనమే కీలకం కావాలని చంద్రబాబు అన్నారు.
చిత్రం..కందుకూరులో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు