రాష్ట్రీయం

అభివృద్ధికి ఊతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 20: సుస్థిర అభివృద్ధికి తాము నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునే అంశంపై ఎప్పటికప్పుడు జిల్లాల కలెక్టర్లతో సమీక్షించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) దినేష్‌కుమార్‌ను ఆదేశించారు. ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో ఆర్థిక అభివృద్ధి, సులభతర వ్యాపార నిర్వహణ, ఎల్పీజీ కేటాయింపులు, విద్యుదీకరణ, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వౌలిక సదుపాయాల కల్పన వంటి కీలక అంశాలపై ముఖ్యమంత్రి చర్చించారు. వాటి పురోగతిపై ఆదివారం జరిగిన టెలీకాన్ఫరెన్స్‌లో సీఎస్ ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం ఇంధన, పెట్టుబడులు, వౌలిక సదుపాయాలు తదితర శాఖల అధికారులతో సీఎస్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లోని నక్సల్స్ ప్రభావిత మారుమూల గ్రామాల్లో నిరంతరంగా త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేసే ప్రాజెక్టు ప్రతిపాదనకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారని సీఎస్ వెల్లడించారు. త్రీఫేజ్ విద్యుత్ సరఫరా ప్రాజెక్టు ప్రతిపాదనకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారని సీఎస్ వెల్లడించారు. త్రీఫేజ్ విద్యుత్ సరఫరా ద్వారా ఆయా ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు పెరగడంతో ప్రజల జీవన ప్రమాణాలు కూడా పెరుగుతాయన్నారు. నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లోని 4972 గ్రామాల్లో ప్రస్తుతం 341 గ్రామాలకే త్రీఫేజ్ కరెంటు అందుతోందని ఇంధన, ఐ అండ్ ఐ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్, ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కె విజయానంద్ వివరించారు. మిగిలిన 4631 గ్రామాలకు త్రీఫేజ్ విద్యుత్‌ను అందించాలంటే రూ. 347 కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లోని మారుమూల గ్రామాలకు త్రీఫేజ్ కరెంట్ ఇవ్వడం వల్ల ఆర్థిక కార్యకలాపాలు పెరిగి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని డీజీపీ మాలకొండయ్య, ఇంటెలిజెన్స్ అదనపు డీజీ ఏబీ వెంకటేశ్వరరావు, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లోని మారుమూల గ్రామాలకు ప్రస్తుతం నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నప్పటికీ అత్యధిక ఊళ్లకు త్రీఫేజ్ కరెంటు అందడం లేదు. సింగిల్ ఫేజ్ కరెంటు మాత్రమే సరఫరా చేస్తున్నారు. ఆయా గ్రామాలకు త్రీఫేజ్ కరెంటు ఇవ్వడం వల్ల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు నెలకొల్పుకునే అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రికి వివరించినట్టు సీఎస్ తెలిపారు. ఫలితంగా 6 జిల్లాల్లోని 4972 గ్రామాల్లో ఆర్థికాభివృద్ధితో పాటు ఉద్యోగ కల్పన పెరిగి
ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయన్నారు. ‘ఖర్చనేది పెద్ద విషయం కాదు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం. ప్రజలకు మెరుగైన విద్య, వైద్యం తదితర సౌకర్యాలు కల్పించాలి. అదే సమయంలో ప్రజలందరికీ నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ను అందించాలి. నక్సల్స్ ప్రభావిత మారుమూల గ్రామాలకూ సరఫరా చేయాలి. రాష్ట్రంలో అర్హులందరికీ 100 శాతం వంటగ్యాస్ కనెక్షన్లు, విద్యుత్ కనెక్షన్లు అందజేశాం. 80 శాతం ఆవాస ప్రాంతాలకు రోడ్డు (0.5 కిమీ రేడియస్) సదుపాయం కల్పించాం. అంతర్గత సీసీరోడ్లు 30,500 కిమీ మేర నిర్మించాం. గ్రామీణ ప్రాంతాల్లో 80శాతం గ్రామాలు బహిరంగ మలవిసర్జన రహితంగా మారాయి’ అని సీఎం పేర్కొన్నట్లు సీఎస్ వెల్లడించారు.