రాష్ట్రీయం

స్వామివారి నగలు భద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, మే 21: తిరుమల వేంకటేశ్వరస్వామి నగలు భద్రంగా ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో నగలకు భద్రత ఉందని అన్నారు. స్వామివారికి చెందిన నగలు అన్నీ ఉన్నాయని, ఎప్పటికప్పుడు ఆడిట్ జరుగుతోందని
ముఖ్యమంత్రి వివరించారు. అనంతపురం జిల్లా రొద్దం మండలం తురకలాపట్నంలో గ్రామంలో సోమవారం జరిగిన బహిరంగసభలో సీఎం మాట్లాడుతూ కుట్ర రాజకీయాలతో కొందరు వెంకటేశ్వరస్వామి ప్రతిష్ట దెబ్బ తీస్తున్నారన్నారు. అనిశ్చితి కల్పించేందుకు వదంతులు ప్రచారం చేస్తున్నారని, అలాంటి వాటిని నమ్మొద్దని కోరారు. వెంకన్న ప్రతిష్టను ఈ ప్రభుత్వం కాపాడుతుందన్నారు. నాడు వెంకటేశ్వరస్వామి ప్రతిష్టను దివంగత ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు కాపాడారని, ఆ తర్వాత తాను కాపాడుతూ వస్తున్నానని అన్నారు. టీటీడీని పురావస్తుశాఖకు అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేసిందన్నారు. అయితే దీనిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో బీజేపీ ప్రభుత్వం ఆ ఆదేశాలను ఉపసంహరించుకుందన్నారు. ఇది ప్రజా విజయమని సీఎం అన్నారు.