రాష్ట్రీయం
పెట్రోలు ధరల పెంపుపై కాంగ్రెస్ వింత నిరసన
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 23 May 2018
హైదరాబాద్, మే 22: పెట్రోలు, డీజిలు ధరల పెరుగుదలను నిరసిస్తూ రాష్ట్ర యువజన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ద్విచక్ర వాహనాలను తోపుడు బండ్లపై పెట్టి నిరసనకు దిగారు. యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో కార్యకర్తలు మంగళవారం గాంధీభవన్ నుంచి నాంపల్లి వైపు తోపుడు బండ్లపై ద్విచక్ర వాహనాలతో ఊరేగింపుగా బయలు దేరారు. అయతే గాంధీ భవన్కు కొద్ది దూరంలోనే పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వివాదం తలెత్తింది. దీంతో నాంపల్లి చౌరస్తా వద్ద ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దగ్గం చేసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెట్రోలు, డీజిలు ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.