రాష్ట్రీయం

నేను సైతం.. * సీఎం సహాయ నిధికి చిన్నారి విరాళం రూ.లక్ష అందించిన వరుణిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 18: ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి సహాయ నిధికి ‘నేను సైతం’ అంటూ ఓ చిన్నారి ముందుకొచ్చింది. తన జన్మదినం సందర్భంగా రూ.లక్ష విరాళం అందజేసి మానవత్వాన్ని చాటుకుంది. తన పుట్టిన రోజు వేడుకకు అనవసరంగా డబ్బులు వృథా చేయకుండా దానిని సీఎం సహాయం నిధికి ఇచ్చిన వరుణిక మానవత్వం మంటగలుస్తున్న ఈ రోజుల్లోనూ మనవతావాదాన్ని చాటేవారున్నారని నిరూపించింది. హైదరాబాద్‌కు చెందిన గడ్డంపల్లి రవీందర్ రెడ్డి కూతురు వరుణిక (10) తాను అభిమానించే మంత్రి కేటీఆర్‌ను కలిసి సీఎం సహాయ నిధికి విరాళం ఇస్తానని తల్లిదండ్రులకు చెప్పింది. దీనితో రవీందర్ రెడ్డి ఆమెను బుధవారం బేగంపేట క్యాంపు కార్యాలయానికి తీసుకొచ్చారు. అక్కడ మంత్రి కేటీఆర్‌కు వరుణిక రూ.లక్ష చెక్కు అందజేసింది. ఇక నుంచి తన ప్రతి పుట్టినరోజున పది మందికి ఉపయోగపడే విధంగా సహాయం చేయనున్నట్టు మంత్రికి వివరించింది. చిన్న వయసులోనే సామాజిక స్పృహతో ఇతరులకు ఉపయోగపడే రీతిలో సాయం చేయడానికి ముందుకొచ్చిన వరుణికను మంత్రి కేటీఆర్ అభినందించి చిన్న మొక్కను బహుమతిగా అందజేసారు.