రాష్ట్రీయం
218వ రోజు కొనసాగిన జగన్ పాదయాత్ర
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 23 July 2018
కాకినాడ, జూలై 22: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి 218 రోజు ప్రజాసంకల్ప యాత్ర ఆదివారం ఉదయం జిల్లా కేంద్రం కాకినాడ నగరంలోని అచ్చంపేట నుండి భారీ జన సందోహం మధ్య ప్రారంభమయ్యింది. అచ్చంపేట జంక్షన్ శిబిరంలో జగన్ను కలిసేందుకు వివిధ వర్గాల ప్రజలు పోటెత్తారు. అచ్చంపేట, గొంచర్ల, బ్రహ్మానందపురం, పి వేమవరం క్రాస్ మీదుగా ఉండూరు శివా రు వరకు పాదయాత్ర కొనసాగింది. కాకినాడ రూర ల్ మండలం నుండి సామర్లకోట మండలంలోకి ప్రవేశించిన జగన్కు ఆయా ప్రాంతాల్లో భారీగా స్వాగతం లభించింది. శనివారం సాయం త్రం నాటికి 2567 కిలోమీటర్లు నడిచిన జగన్ ఆదివారం 6.6 కిలోమీటర్ల మేర నడిచి, 2573.8 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తిచేశారు. అచ్చంపేట జంక్షన్ వద్ద పెద్ద ఎత్తున జగన్కు మద్దతు తెలిపారు.