ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో రైల్వే ప్రాజెక్ట్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (రైల్వేస్టేషన్), ఆగస్టు 9: విజయవాడ డివిజన్ పరిధిలో రైల్వే ప్రాజెక్ట్‌ల పూర్తికి ఆంధ్ర రాష్ట్రం పూర్తి స్థాయిలో సహకారం అందించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ అన్నారు. డివిజనల్ రైల్వే ఆసుపత్రి విభాగంలో అవుట్ పేషంట్ విభాగానికి చెందిన ఓపీ బ్లాక్‌కు ఆయన గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడిన తరువాత ఈ రాష్ట్రంలో ఉన్న తమ ప్రదేశాలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరించడంతో ప్రవేశపెట్టిన ప్రాజెక్టుల అభివృద్ధి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురాగలుగుతున్నామన్నారు. డివిజనల్ ప్రధాన ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అవుట్ పేషంట్ వార్డు నిర్మాణం కోసం రూ. 3.7 కోట్లు కేటాయించారన్నారు. అలాగే ఆంధ్ర రాష్ట్రంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలు 2020-21 నాటికి పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. ఈ విలేఖర్ల సమావేశంలో డిఆర్‌ఎం ధనుంజయులు, తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.