రాష్ట్రీయం

జనసేనలోకి ముత్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 18: ఏదో లబ్ధి పోందాలని తాను రాజకీయాల్లోకి రాలేదని, త్రికరణ శుద్ధిగా ప్రజలకు సేవ చేయాలన్నదే తన లక్ష్యమని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ అన్నారు. శనివారం నాడు హైదరాబాద్ మాదాపూర్‌లోని పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి కాకినాడకు చెందిన ముత్తాగోపాలకృష్ణ, ఆయన కుమారుడు ముత్తా శశిధర్‌తో పాటు వారి అనుచరులు 500 మంది జనసేనలో చేరారు. వారికి జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీలోకి యవశక్తితో పాటు అనుభవజ్ఞులు చాలా అవసరమని అన్నారు. రాజకీయాల్లోకి పరిపూర్ణ అవగాహన ఉన్న ముత్తాగోపాలకృష్ణ జనసేనలోకి రావడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీలో ముత్తాకు స్థానం కల్పిస్తున్నట్టు చెప్పారు. పార్టీ విధానాల్లో సలహాలు , సూచనలు తీసుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా ముత్తామాట్లాడుతూ పవన్ ఆశలు ఆశయాలకు అనుగుణంగానే జనసేన పార్టీకి సేవ చేయడానికి వచ్చినట్టు చెప్పారు.