రాష్ట్రీయం

ఫైబర్ నెట్ వచ్చేస్తోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: ఇంటర్నెట్ సదుపాయాలకల్పనలో మరో విప్లవాత్మక అడుగు పడబోతోంది. నామమాత్రపు రుసుముతో కేబుల్, టెలిఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్లు అందించే ఫైబర్‌నెట్‌ను ప్రయోగాత్మకంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో అమలు చేసే ప్రక్రియను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విశాఖలో గురువారం ప్రారంభించనున్నారు. ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చే క్రమంలో 10 ఎంబిపిఎస్ వేగంతో కేవలం రూ.150కే ఇంటర్నెట్ సదుపాయం కల్పించనున్నారు. తొలి దశలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల వినియోగదార్లకు ఈ అవకాశాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. కేబుల్ కనెక్షన్లతో ఇంటర్నెట్ సదుపాయం కల్పించేందుకు వీలుగా జరుగుతున్న ఏర్పాట్లను ఫైబర్‌నెట్ మేనేజింగ్ డైరెక్టర్ కె.సాంబశివరావు మంగళవారం విశాఖ నగరంలో పరిశీలించారు. వినియోగదారులకు సెట్‌టాప్ బాక్స్‌తో కూడిన ఫైబర్‌నెట్ కనెక్షన్ ఇవ్వడంతో పాటు భవిష్యత్‌లో మరిన్ని సదుపాయాలు కల్పించేందుకు వీలుగా సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఫైబర్‌నెట్ కనెక్షన్లు మంజూరు చేసేందుకు అవసరమైన వౌలిక సదుపాయాల కల్పన విషయంలో అధికార యంత్రాంగం ఇప్పటికీ సన్నద్ధం కాలేకపోతోంది. ముఖ్యంగా ఫైబర్‌నెట్ కనెక్షన్ ఇచ్చేందుకు వీలుగా కేబుల్ వ్యవస్థను ఏ విధంగా నిర్వహించాలన్న అంశంలో ఇప్పటికీ స్పష్టత లేదు. ఇప్పటికే నగరంలో విద్యుత్, కేబుల్ వైర్లతో పూర్తి అస్తవ్యస్తంగా ఉన్న విధానం వల్ల ఫైబర్‌నెట్ కల్పన ఎంత వరకు సాధ్యపడుతుందన్నది ప్రశ్నార్ధకంగా మారింది. భూగర్భ కేబుల్ వ్యవస్థ అందుబాటులోకి వస్తే తప్ప ఫైబర్‌నెట్ కనెక్షన్ల జారీ సాధ్యం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బాలారిష్టాలెన్ని ఉన్నప్పటికీ అనుకున్న ప్రకారం తొలి దశ ఫైబర్‌నెట్ కనెక్షన్ల జారీ చేయాల్సిందేనన్న పట్టుదలతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇదే అంశాన్ని ఫైబర్‌నెట్ సంస్థ ఎండి సాంబశివరావు వెల్లడించారు. ఆయన కలెక్టర్‌తో కలిసి నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి, సాధ్యాసాధ్యాలను పరిశీలించారు.

కేంద్ర పథకాలకు
మోదీ పేరు పెట్టండి!
బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 15: కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పథకాల కింద వేల కోట్ల రూపాయల నిధులు రాష్ట్రాలకు విడుదలవుతున్నాయని, వాటి పేర్లను మార్చి, ప్రభుత్వాలు లబ్దిదారులకు అందిస్తున్నాయని ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం పలు పథకాల కింద విడుదల చేస్తున్న నిధులకు మోదీ పేరును చేర్చి, లబ్దిదారులకు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. శాసనమండలిలో మంగళవారం జరిగిన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఈ అంశంపై ఆసక్తికరమైన చర్చ జరిగింది. కేంద్ర విడుదల చేస్తున్న నిధులను లబ్దిదారులకు ఇచ్చేప్పుడు చంద్రబాబు, లేదా ఎన్టీఆర్ పేర్లను చేర్చుతున్నారని, ఇకపై మోదీ పేరుతో ఆయా పథకాలను జనాల్లోకి తీసుకువెళితే బాగుంటుందని అన్నారు. దీనికి మంత్రి యనమల రామకృష్ణుడు సమాధానం ఇస్తూ, మోదీ పేరు చేర్చడానికి తమకు అభ్యంతరం లేదని అన్నారు.
ఆ నిధులు వస్తున్నాయా?
2014-15, 2015-16 సంవత్సరాలకు రాష్ట్ర ప్రభుత్వం సమీకరించిన రెవెన్యూ వనరుల గురించి సభ్యులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సుభాష్ చంద్రబోస్, గోవిందరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి యనమల సమాధానం చెపుతూ 2014-15లో పన్ను రాబడి 29,857 కోట్లు, పనే్నతర రాబడి 8,180.23 కోట్లు, కేంద్ర పన్నులలో వాటా 11,446.16 కోట్లు, కేంద్రం నుంచి గ్రాంట్లు 16,210.89 కోట్లు అని పేర్కొన్నారు. అలాగే 2015-16 మార్చి ఎనిమిదవ తేదీ వరకూ పన్ను రాబడి 36,316.26 కోట్లు, పనే్నతర రాబడి 3,774.81 కోట్లు, కేంద్ర పన్నులలో వాటా 19,155.86 కోట్లు, కేంద్రం నుంచి గ్రాంట్లు 18,347 కోట్లు అని యనమన పేర్కొన్నారు. దీనిపై ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్ర నుంచి గ్రాంట్ అనుకున్న మేర రావడం లేదని తెలిసిందని అన్నారు. కేంద్రం మంజూరు చేసిన నిధులకు యుటిలైజేషన్ సర్ట్ఫికెట్ సమర్పించకపోవడం వలన నిధులు రావడం లేదని బిజెపి నాయకులు చెపుతున్నారని అన్నారు. దీనికి కారణం ఏంటని ప్రశ్నించారు. మంత్రి యనమల సమాధానం చెపుతూ యుసిలు పంపించడంలో కాస్తంత ఆలస్యం కావచ్చని, ఏదియేమైనా కొంత అటు ఇటుగా కేంద్ర నిధులు వస్తున్నాయని చెప్పారు.