రాష్ట్రీయం
బలపడిన తీవ్ర అల్పపీడనం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 20 September 2018
విశాఖపట్నం, సెప్టెంబర్ 19: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి, బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత వాయుగుండంగా మారుతుందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇది తదుపరి 12 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారుతుందన్నారు. తీవ్ర వాయుగుండం వాయువ్య దిశగా కదులుతూ ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాల ప్రాంతాల్లోని కళింగపట్న-పూరి మధ్య గురువారం రాత్రి లేదా శుక్రవారం ఉదయం తీరం దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో కోస్తాలో పలు చోట్ల చెదురు మదురు వర్షాలు కురుస్తాయన్నారు. ఒకటి,రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయన్నారు.మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.