రాష్ట్రీయం

ముందస్తుకు ముందే కాంగ్రెస్‌లో కమిటీల లొల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 21: ముందస్తు ఎన్నికలను ధీటుగా ఎదుర్కొని అధికారాన్ని హస్తగతం చేసుకోవాలనుకుంటున్న కాంగ్రెస్ నాయకత్వానికి ముందుగా కమిటీల లొల్లి తలనొప్పిగా మారింది. ఇంకా అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఎంత గందరగోళం ఏర్పడుతుందోనన్న ఆందోళన లేకపోలేదు. ముందస్తును సమర్థవంతంగా ఎదుర్కొవడానికి కాంగ్రెస్ అధిష్టానం తొమ్మిది వేర్వేరు కమిటీలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పార్టీ సీనియర్లలో చాలా మంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ప్రచార కమిటీని ఆశించిన ఎఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ వి. హనుమంత రావుకు స్ట్రాటజీ కమిటీ చైర్మన్ బాధ్యత అప్పగించడంతో ఆయన విస్తుపోయారు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తికి లోనై ఆంధ్రకు చెందిన పార్టీ నేత ఒకరు తనకు ప్రచార కమిటీ చైర్మన్ పదవి రాకుండా అడ్డుకున్నారంటూ విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా కమిటీల్లో బ్రోకర్లు ఉన్నారని, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ ఆర్‌సీ కుంతియా శనిలా దాపురించారని ధ్వజమెత్తారు. మరో ఎఐసీసీ కార్యదర్శి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి కూడా విమర్శలు చేశారు. పార్టీలో కొత్తగా చేరిన తాజా మాజీ ఎమ్మెల్యే ఎ. రేవంత్ రెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాఉండగా పార్టీ రాష్ట్ర నాయకత్వం దీనిని సీరియస్‌గా పరిగణించి పార్టీ క్రమశిక్షణా సంఘానికి నివేదించడంతో, క్రమశిక్షణా సంఘం చైర్మన్, మాజీ ఎమ్మల్యే ఎం. కోదండ రెడ్డి అధ్యక్షతన కమిటీ సమావేశమై ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నోటీసు పంపించింది. ముందస్తు ఎన్నికలను సమిష్టిగా ఎదుర్కొవాలని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాందీ సూచించిన తర్వాత కూడా లుకలుకలు ప్రారంభమయ్యాయని, అధిష్టానం ప్రకటించిన కమిటీలను విమర్శించడం ద్వారా అధిష్టానం తీసుకున్న నిర్ణయానే్న వ్యతిరేకించినట్లు అవుతుందని పార్టీ నాయకులు అంటున్నారు. పార్టీ అధిష్టానం ఆదేశాలను శిరోధార్యం అనకుండా ఇలా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోవాలని కొంత మంది నాయకులు కోరుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఎలా ఉంటుందోనన్న అనుమానాలను పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు.