రాష్ట్రీయం

గిరిజన నేతల హత్య దారుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: గిరిజన హక్కులకోసం పోరాటం చేస్తున్నామని చెప్పుకొనే మావోయిస్టులు గిరిజన ప్రజా ప్రతినిధులను హత్య చేయడం దారుణమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. సోమవారం నారాయణ ఢిల్లీలో విలేఖరులతో మాట్లాడుతూ అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను నక్సల్స్ హత్య చేయడాన్ని ఖండించారు. ప్రభుత్వ విధానాలు కూడా ఈ సమస్యకు కారణమని ఆయన పేర్కొన్నారు. రాఫెల్ ఫైటర్ జెట్స్ కొనుగోళ్లలో బీజేపీ అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ కనుసన్నల్లోనే ఈ వ్యవహారం జరిగిందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఆయుష్మాన్‌భవ’ బోగస్ పథకమని, దేశంలో ఉన్న అన్ని ఆసుపత్రులను ప్రైవేటుపరం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని నారాయణ ఆరోపించారు.