ఆంధ్రప్రదేశ్‌

రక్తమోడిన రహదారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదమరి/కనిగిరి: చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో సోమవారం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు. చిత్తూరు జిల్లా యాదమరి మండల పరిధిలో సోమవారం వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందారు. సోమవారం వేకువజామున లక్ష్మయ్య కండిగ వద్ద బొలెరా వాహనాన్ని లారీ ఢీ కొనడంతో శాంతిపుర మండలానికి చెందిన ముగ్గరు టిడిపి నేతలు మరణించగా, సాయంత్రం ఇదే మండలంలోని కుక్కల పల్లి వద్ద స్కూటర్ ను ఇన్నోవా వాహనం ఢీ కొనడంతో ఇద్దరు కార్మికలు దుర్మరణం పాలయ్యారు. శాంతిపురం మండల టిడిపి అధ్యక్షుడు వెంకటముని రెడ్డి తోపాటు మరికొంత మంది టిడిపి నేతలు కడప జిల్లా రాజంపేటలో వివాహనికి వెళ్లారు. తిరిగి బొలెరా వాహనంలో ఆదివారం రాత్రి అక్కడ నుంచి స్వగ్రామానికి బయలుదేరారు. ఈక్రమంలో సోమవారం వేకువజామున యాదమరి మండల పరిధిలోని లక్ష్మయ్య కండిగ వద్ద వీరి వాహనాన్ని ఎదరుగా వస్తున లారీ ఢీ కొనడంతో బొలెరా లోని శాంతిపురం మండల టిడిపి అధ్యక్షుడు వెంకట ముని రెడ్డి (55), బాలక్రిష్ణ(48),సురేష్ రెడ్డి(28)లు అక్కడి కక్కడే మృతి చెందగా శాంతిపుర మండల సొగల బండ సర్పంచ్ గోపాల్ తీవ్రంగా గాయపడ్డారు.ఇతన్ని వెంటనే వేలూరు సిఎంసికి తరలించారు. ఇదే మండలం కుక్కల పల్లి వద్ద సోమవారం సాయంత్రం బాటిల్ ఫ్యాక్టరీలో కార్మికులుగా పని చేస్తున్న చంద్రగిరికి చెందిన రఘు,గుడిపాల మండలంలోని పిళ్లారి కుప్పం గ్రామానికి చెందిన శేఖర్‌లు విధులు ముంగించుకొని స్కూటర్ లో వస్తుండగా ఎదురుగా వస్తున్న ఇన్నోవా ఢీ కొనడంతో వీరు ఇరువురు మృత్యువాత పడ్డారు. యాదమరి పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రకాశం జిల్లాలో నలుగురు దుర్మరణం
పెళ్లి బృందం ట్రాక్టర్‌ను లారీ ఢీకొట్టిన దుర్ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. ప్రకాశం జిల్లా పిసిపల్లి మండలం వెంగళాపురం గ్రామానికి చెందిన సిహెచ్ గంగయ్య మనుమరాలి పెళ్లి వేడుకలు కనిగిరి పట్టణంలోని వెంకటేశ్వర దేవస్థానంలో సోమవారం తెల్లవారుజామున జరిగాయి. వివాహ అనంతరం పెళ్లి బృందం తమ స్వగ్రామానికి ట్రాక్టర్‌లో బయలుదేరి వస్తుండగా కందుకూరు రోడ్డులోని ఏబిఆర్ ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ ట్రాక్టర్‌ను బలంగా ఢీకొట్టంతో ఈ ప్రమాదం జరిగింది. ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్న డి నరసింహులు (30), నరేష్ (10), ప్రవీణ (15), డి రాఘవమ్మ (50) మృతి చెందగా 15మందికి తీవ్రగాయాలైయ్యాయి. గాయాలు అయిన డి మహేష్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.