రాష్ట్రీయం

కాకా వారసుల దారెటు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, అక్టోబర్ 15: తండ్రి చాటు తనయులుగా ముద్రపడ్డ మాజీ కేంద్ర మంత్రి వెంకటస్వామి (కాకా) తనయులు గడ్డం వినోద్, వివేక్‌ల రాజకీయ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. చెన్నూర్ అసెంబ్లీ టికెట్‌పై గంపెడాశలు పెట్టుకొని నిరీక్షించిన మాజీ మంత్రి గడ్డం వినోద్‌కు పార్టీ టికెట్ దక్కకపోగా సిట్టింగ్ అభ్యర్థి నల్లాల ఓదెలును మార్చి ఎంపీ బాల్క సుమన్‌కు టికెట్ ఖరారు చేయడంతోనే అసమ్మతి సెగలు ఎగిసిపడ్డాయి. ఓవైపు టికెట్ దక్కలేదనే నిరాశతో ఓదెలు తీవ్ర అసంతృప్తికి లోనుకాగా పార్టీలో తలెత్తిన ఘర్షణలో గట్టయ్య అనే కార్యకర్త మృతిచెందాడు. ఈ పరిణామంతో కంగుతిన్న టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అసమ్మతి నేతలను బుజ్జగించి ఓదెలును సముదాయించగా, పరిస్థితి చక్కదిద్దుకుందన్న క్రమంలోనే తాజాగా మాజీ మంత్రి వినోద్ తనకు టికెట్ దక్కకపోవడంపై బాహాటంగానే అసంతృప్తి వెళ్లగక్కారు. కాంగ్రెస్ నుండి టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ముందునుండి అసహనం వ్యక్తం చేస్తున్న వినోద్‌కు ఈసారి టికెట్ రాకపోవడంపై ఆయన వర్గీయులు అలకపానె్పక్కారు. బాల్క సుమన్‌కు మద్దతుగా ప్రచారం సాగించలేమని, అభ్యర్థిత్వాన్ని మార్చి వినోద్‌కు ఇవ్వాలని రెండుసార్లు వినోద్ వర్గీయులు సమావేశం నిర్వహించుకోవడం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. వద్దన్నా వినకుండా వివేక్ చొరవతోనే తాను టీఆర్‌ఎస్‌లోకి వెళ్ళాల్సి వచ్చిందని, పెద్దపెల్లి ఎంపీ టికెట్ వివేక్‌కు, చెన్నూర్ లేదా బెల్లంపల్లి స్థానాల్లో తనకు ఇస్తామని ఆశచూపి మోసం చేశారని వినోద్ కార్యకర్తల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. తమ్ముడు వివేక్ తీరుపై గుర్రుగా ఉన్న వినోద్ కాంగ్రెస్ పెద్దలతో ఉన్న అనుబంధం మేరకు ఆపార్టీలో చేరేందుకు సీనియర్లతో మంతనాలు సాగిస్తున్నట్లు తెలిసింది. మంత్రి కేటీఆర్‌తో భేటీ అయిన వినోద్ వర్గీయులకు ఎట్టిపరిస్థితుల్లోనూ బాల్క సుమన్‌ను మార్చేది లేదని తేల్చిచెప్పడంతో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తామని హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. కాంగ్రెస్‌లో చేరితే పెద్దపల్లి ఎంపి టికెట్ వివేక్‌కు, చెన్నూర్ లేదా బెల్లంపల్లి స్థానాలను వినోద్‌కు కట్టబెడుతామని కాంగ్రెస్ సీనియర్లు హామీ ఇచ్చినట్లు తెలిసింది. వెంకటస్వామితో పార్టీకి ఉన్న అనుబంధం మేరకు రెండు టికెట్లపై భరోసా ఇచ్చినట్లు సమాచారం.
అయితే, ప్రభుత్వ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్న జి.వివేక్ ఆచితూచి అడుగేస్తున్నట్లు సమాచారం. తాను మాత్రం టీఆర్‌ఎస్‌తో తెగతెంపులు చేసుకొని తాడోపేడో తేల్చుకునేందుకు వినోద్ సన్నద్దమవుతుండగా కార్యకర్తలు కూడా ఆయన వెన్నంటూ ఉంటామని మద్దతు ప్రకటించడం గమనార్హం. తాజాగా మారిన పరిణామాలపై జి.వినోద్‌ను వివరణ కోరగా కార్యకర్తలు పోటీ చేయాలని ఒత్తిడి తెస్తున్నారని, అధిష్ఠాన వైఖరిలో మార్పువస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. కార్యకర్తలు, అభిమానుల అభిమతం మేరకే తాను రాజకీయ నిర్ణయం తీసుకుంటానని, ప్రస్తుతం ఏమీ మాట్లాడలేనని స్పష్టం చేయడం గమనార్హం.

చిత్రాలు.. జీ. వివేక్, జీ. వినోద్