రాష్ట్రీయం

తిత్లి బాధితులను ఆదుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, అక్టోబర్ 21: శ్రీకాకుళం జిల్లా అంటే దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ప్రాణప్రదంగా భావించేవారని, అలాంటి జిల్లా ప్రకృతి విపత్తులతో తల్లడిల్లుతున్న నేపథ్యంలో నందమూరి అభిమానులు ప్రజలకు అండగా నిలవాలని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. తుపాను బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రూ.25లక్షల విరాళాన్ని ఆదివారం చెక్కు రూపంలో అందజేశారు. తుపాను నష్టంపై కేంద్రం స్పందించకపోవటం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు. తక్షణం జాతీయ విపత్తుగా ప్రకటించి బాధితులకు సాయం అందించాలని డిమాండ్ చేశారు. తిత్లీ, ఉద్ధానం రీకన్‌స్ట్రక్షన్ ప్రోగ్రామ్ యూనిట్ (తూర్పు)కు విరివిగా
విరాళాలను ముఖ్యమంత్రి సహాయనిధికి పంపాలని అభిమానులను కోరారు. కేంద్రం సహకరించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ముందుకొచ్చి చేపట్టే సహాయ, పునరావాస చర్యలు స్ఫూర్తిదాయకమన్నారు. విపత్కర సమయాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రభుత్వానికి అండగా నిలిచి శ్రీకాకుళం పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని ప్రజలకు బాలయ్య విజ్ఞప్తి చేశారు.

చిత్రం..తిత్లీ తుపాను బాధితుల సహాయార్థం
ముఖ్యమంత్రి చంద్రబాబుకు రూ. 25లక్షల చెక్కు అందజేస్తున్న బాలకృష్ణ