రాష్ట్రీయం

తెరాసను విస్తరిస్తే ఏపీలోనూ గెలుస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మపురి, నవంబర్ 5: ఒక లక్ష్యంతో వ్యవస్థీకృతమై, లక్ష్య సాధనకు ఉద్యమ పార్టీగా పురుడు పోసుకుని, అనంతరం రాజకీయ పార్టీగా రూపాంతరం చెంది, లక్ష్యాన్ని సాధించి, అద్భుత పాలన అందిస్తున్న కేసీఆర్ నేతృత్వంలోని తెరాసను గనుక ఆంధ్ర రాష్ట్రానికి విస్తరిస్తే, అక్కడా ప్రజామోదం పొంది గెలవడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే, చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ అన్నారు. సోమవారం జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన పద్మశాలి కుల బాంధవుల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా ఈశ్వర్ పాల్గొన్నారు. కేసిఆర్ నాయకత్వంలో 50 మాసాలలో సాధించిన ప్రగతిని ఈ సందర్భంగా ఆయన వివరించారు. కేసిఆర్ అచిర కాలంలోనే దేశానికి, ఇతర రాష్ట్రాలకు ఆదర్శనీయ పాలకులైనారని, కేసిఆర్ ప్రకటించి, అమలు చేసే కార్యక్రమాలను, వెనువెంటనే ఏపీలోనూ పెట్టాలన్న అక్కడి పాలితుల డిమాండ్లను బట్టి, తమ ముఖ్యమంత్రి పాలనా దక్షత స్పష్టం అవుతున్నదన్నారు. ధర్మపురి ఎంపీపీ మమతారావు, వైస్ ఎంపీపీ రాజేశ్, పీఏసీఎస్ చైర్మన్లు రాజేందర్, నరేశ్ పాల్గొన్నారు.

చిత్రం..ధర్మపురి క్షేత్రంలో పద్మశాలి ఆత్మీయ సమ్మేళనంలో ప్రసంగిస్తున్న ఈశ్వర్