రాష్ట్రీయం

గోదావరి జిల్లాల్లో కార్తీక సందడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, నవంబర్ 12: కార్తీక మాసం తొలి సోమవారం ఉభయ గోదావరి జిల్లాల్లోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. కార్తీక మాసం, అందులోనూ శివుని ప్రీతిపాత్రమైన సోమవారం కావడంతో మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయాలను సందర్శించారు. సోమవారం వేకువజాము నుండే రెండు జిల్లాలోని గోదావరి తీరాలు పుణ్యస్నానాలు చేసి, దీపాలు వదిలే భక్తులతో సందడి సందడిగా మారాయి. ఉభయ గోదావరి జిల్లాలోని భీమవరం, పాలకొల్లు, సామర్లకోట, ద్రాక్షారామలోని నాలుగు పంచారామ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. ఇవికాక అన్ని శివాలయాల్లో భక్తులు బారులు తీరారు.