రాష్ట్రీయం

ఏ పార్టీ బీసీలను గుర్తించలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 13: అన్ని రాజకీయ పార్టీలూ ఉద్దేశపూర్వకంగా బీసీలకు టిక్కెట్లు ఇవ్వలేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, తాజా మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన ఆన్ని పార్టీలకూ సూచించారు. లేని పక్షంలో బీసీలకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ఈ నెల 17న రాష్ట్ర బంద్ నిర్వహిస్తామని ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ తప్ప మిగతా రాజకీయ పార్టీలన్నీ అన్యాయం చేశాయని ఆయన విమర్శించారు.
దేశంలో 56 శాతానికి పైగా బీసీలు ఉన్నారని ఆయన తెలిపారు. అయినా 14 శాతం కూడా బీసీలకు ప్రాతినిధ్యం లేదని, ఇది ప్రజాస్వామ్యం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. పథకం ప్రకారమే బీసీలకు టిక్కెట్లు ఇవ్వలేదని ఆయన విమర్శించారు.