రాష్ట్రీయం

రక్తపు మరక చొక్కా అప్పగించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం(క్రైం), నవంబర్ 17: వైసీపీ అధినేత జగన్‌పై దాడి సంఘటనలో రక్తపు మరకలున్న చొక్కాను ఈ నెల 23లోగా దర్యాప్తు అధికారులకు అందజేయాల్సిందిగా ఇక్కడి ఏడో అదనపు మెట్రో పాలిటన్ జడ్జి శనివారం సమన్లు జారీ చేశారు. విశాఖ విమానాశ్రయంలో వైఎస్‌ఆర్ సీపీ అధినేత జగన్‌పై వెయిటర్‌గా జె.శ్రీనివాసరావు కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. అయితే రక్తపు మరకలున్న చొక్కాను జగన్ ఇంతవరకు పోలీసులకు అందజేయకపోవడంతో న్యాయమూర్తి మండిపడ్డారు. కేసు దర్యాప్తులో కీలకమైన రక్తపు మరకలున్న చొక్కాను వెంటనే దర్యాప్తు అధికారులకు అందజేయాల్సిందిగా న్యాయమూర్తి సమన్లు పంపారు.