రాష్ట్రీయం
ఉత్సాహంగా నేవీ మారథాన్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
విశాఖపట్నం, నవంబర్ 18: నౌకాదళ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతిఏటా నిర్వహించే వైజాగ్ నేవీ మారథాన్ ఆదివారం విశాఖ సాగర తీరంలో అట్టహాసంగా జరిగింది. దాదాపు 15వేలకు మంది పైగా మారథాన్లో పాల్గొన్నారు. సింబెక్స్ 18 ద్వైపాక్షిక విన్యాసాల్లో పాల్గొంటున్న రాయల్ సింగపూర్ నేవీ సిబ్బంది ఈ వేడుకలో పాల్గొన్నారు. నేవీ మారథాన్ను 42.2కిమీ కరేజ్ రన్, 21.1 డెస్టినీ రన్, 10 కిమీ ఫ్రెండ్షిప్ రన్, 5 కిమీ ఫన్ రన్ కేటగిరీల్లో నిర్వహించారు. ప్రస్తుతం తూర్పు తీరంలో ద్వైపాక్షిక విన్యాసాల్లో పాల్గొంటున్న రాయల్ సింగపూర్ నేవీ (ఆర్ఎస్ఎన్) సిబ్బంది ప్రతినిధులు 10 కిమీ ఫ్రెండ్షిప్ రన్లో పాల్గొన్నారు. తూర్పు నౌకాదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ కరమ్బీర్ సింగ్ 5 కిమీ ఫన్ రన్ను, ఆర్ఎస్ఎన్ ఫ్లీట్ కమాండర్ రియర్ అడ్మిరల్ ఎడ్విన్ లియోంగ్ 10కిమీ ఫ్రెండ్షిప్ రన్ను ప్రారంభించారు. 42.2 కిమీ కరేజ్ రన్ పురుషుల విభాగంలో మోహిత్ రాథోడ్, మహిళల విభాగంలో కె.తిరుపతమ్మ ప్రథమ స్థానాలు సాధించారు. వీరికి ఒక్కొక్కరికి రూ. లక్ష చెక్కును తూర్పునౌకాదళ ప్రధానాధికారి కరమ్బీర్ సింగ్ అందజేశారు.