రాష్ట్రీయం

నాకెన్ని మార్కులేస్తారో మీ చేతిలోనే ఉంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట రూరల్/ సిద్దిపేట అర్బన్/ సిద్దిపేట టౌన్, నవంబర్ 20: మీ ఇంట్లో బిడ్డగా.. మీ అందరి వాడిగా కష్ట సుఖాల్లో మీ కుటుంబ సభ్యుడిగా నాలుగున్నరేళ్లు పనిచేశా... ఈ ఎన్నికల పరీక్షల్లో ఎన్ని మార్కులు వేస్తారో మీ చేతిలో ఉందని, మీ కుటుంబ సభ్యుడిగా మీరు నన్ను ఆశీర్వదించాలని ఆపద్ధర్మ మంత్రి, సిద్దిపేట టీఆర్‌ఎస్ అభ్యర్థి తన్నీరు హరీష్‌రావు అన్నారు. సిద్దిపేట పత్తి మార్కెట్ యార్డు మైదానంలో జరిగిన టీఆర్‌ఎస్ ఆశీర్వాద సభలో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన దీవెనలతో, ప్రజల ఆశీర్వాదంతో నాలుగున్నరేళ్లుగా చేసిన అభివృద్ధి మీ కండ్ల ముందే ఉందన్నారు. ఇప్పుడు పరీక్ష వచ్చింది ఈ పరీక్షల్లో నాకు ఎన్ని మార్కులు వేస్తారో మీ చేతుల్లోనే ఉందన్నారు. మీ ఇంట్లో మీ కొడుకు పదవ తరగతి పరీక్ష వ్రాస్తే ఫస్ట్ క్లాస్‌లో పాసు కావాలని మీరు ఎలా కొరుకుంటారో, లెక్కల్లో వంద మార్కులు రావాలని ఎలా కోరుకుంటారో అలా మీ కుటుంబ సభ్యుడిగా నిలబడ్డాను, నాలుగున్నరేళ్లలో ప్రగతి పరీక్ష వ్రాశానని, ఈ పరీక్షల్లో నాకు ఎన్ని మార్కులు వేస్తారో మీ చేతుల్లోనే ఉందన్నారు.
ఎంత ఎదిగితే అంత ఒదిగి పనిచేయాలని కేసీఆర్ మాకు నేర్పారని, ప్రజల ఆశీస్సులు, దీవెనలు తీసుకొని ఆ శక్తి నుండి ప్రజలకు సేవ చేయాలని మాకు నేర్పించారన్నారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి ఇక్కడ సేవ చేసే అదృష్టాన్ని కల్పించారు. కేసీఆర్ నాయకత్వంలో సిద్దిపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానన్నారు. గతంలో సిద్దిపేటకు వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ సిద్దిపేట జిల్లా, మెడికల్ కాలేజీ ఏర్పాటుతో పాటు రైల్వే లైన్ మూడు హామీ లిచ్చి నెరవేర్చిన తర్వాత మళ్లీ సిద్దిపేటకు వచ్చారన్నారు.
సీఎం ఆశీస్సులతోనే దుబ్బాక అభివృద్ధి
- మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ అభ్యర్థి
సోలిపేట రామలింగారెడ్డి
దుబ్బాక నియోజకవర్గం అంటేనే కరవుతో విలయతాండవం చేస్తుండేదని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ఆశీస్సులతో దుబ్బాకను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని దుబ్బాక మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ అభ్యర్థి సోలీపేట రామలింగారెడ్డి అన్నారు. సిద్దిపేటలో జరిగిన టీఆర్‌ఎస్ ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇచ్చి ఇంటింటికి మంచినీటి సరఫరాను చేయడం జరుగుతుందన్నారు. సీఎం కృషితోనే దుబ్బాకలో మంచినీటి సమస్యను పరిష్కరించుకోవడం జరిగిందన్నారు. సిద్దిపేట నుండి దుబ్బాకకు కాళేశ్వరం నీళ్లు కాలువల ద్వారా కరవును శాశ్వతంగా తరిమికొట్టేందుకు దుబ్బాక ప్రాంతంలో చెరువులు, కుంటలు, వాగులు ప్రధానంగా కూడవెళ్లి వాగును జీవనది చేస్తూ జలకళ సంతరించుకునేలా నింపి ఈ ప్రాంతం సస్యశ్యామలం చేసేందుకు సీఎం కృషి చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రతి సంక్షేమ పథకాన్ని వందకు వందశాతం పూర్తి చేస్తామన్నారు.
చిత్రాలు.. ఆశీర్వాద సభలోమాట్లాడుతున్న టీఆర్‌ఎస్ అభ్యర్థి
హరీష్‌రావు. (ఇన్‌సెట్‌లో )*గులాబీ పూలతో సీఎంకు స్వాగతం పలుకుతున్న మంత్రి హరీష్‌రావు