రాష్ట్రీయం

కొత్త యుగం వైపు తొలి అడుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 6: కియా మోటార్స్‌తో ఒప్పందం కొత్త యుగంవైపు ప్రయాణానికి తొలి అడుగుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. వెలగపూడి సచివాలయంలో 1వ బ్లాక్ బయట ఏర్పాటు చేసిన వేదికపై గురువారం ఏపీ ప్రభుత్వానికి, కియా మోటార్స్ మధ్య భవిష్యత్ తరం ప్రపంచశ్రేణి రవాణా భాగస్వామ్యంపై అవగాహనా ఒప్పందం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ ఒప్పందంతో ఆటోమొబైల్ రంగంలో ఏపీ కీలక అడుగు వేసిందన్నారు. రాష్ట్ర చరిత్రలో ఇది ఒక మైలురాయిగా నిలుస్తుందన్న ఆకాంక్ష వ్యక్తం చేశారు. ప్రపంచంలోని అతిపెద్ద మోటార్ కంపెనీల్లో ఒకటైన కియాతో ఒప్పందం కుదుర్చుకోవడం తనకు సంతోషంగా ఉందన్నారు. ప్రపంచంలో అత్యుత్తమ ప్రజా రవాణా వ్యవస్థలను పరిశీలించి ఏపీలో పూర్తి పర్యావరణ హితమైన వాహన వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు దోహదపడాలని కియా సంస్థను ముఖ్యమంత్రి కోరారు. కియా అడుగుపెట్టడంతో వెనుకబడిన అనంతపురం జిల్లా జాతకం పూర్తిగా మారిపోయిందన్నారు. కియా తొలి కారు జనవరి లేదా ఫిబ్రవరిలో బయటకు
వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఏడాదిన్నరలో మొదటి కారు బయటకు రావడం రికార్డుగా అభివర్ణించారు. ఇక్కడ తయారైన కియ కార్లలో 90 శాతం దేశీయ అవసరాలకు సరిపోతాయని, 10 శాతం ఎగుమతి చేసే అవకాశం ఉంటుందన్నారు. పీల్చే గాలిలో నాణ్యత పెంచేందుకు విద్యుత్ కార్లు దోహదపడతాయన్నారు. పర్యావరణ హిత ప్రజారవాణా వ్యవస్థను అందించడంలో సహకరించాలని కోరారు. ఏపీని సంతోషదాయక రాష్ట్రంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. పరిశ్రమలను ప్రోత్సహించేందుకు కియా మనకు బ్రాండ్ అంబాసిడార్‌గా ఉపయోగపడుతుందన్నారు. ఏపీకి కియా బెస్ట్ ఫ్రెండ్ అని కితాబిచ్చారు. రానున్న తరం అవసరాలకు ఉపయుక్తమయ్యే ప్రజా రవాణా వ్యవస్థను తీసుకురావడంలో పరిశోధనలు, అధ్యయనంలో సహకరించేందుకు కన్సల్టెంట్‌గా ఉండాలని ఆ సంస్థకు సూచించారు. త్వరలో రాష్ట్రానికి 7300 మూడు చక్రాల ఎలక్ట్రికల్ వాహనాలు వస్తాయని, వాటిని వ్యర్థ సేకరణ ప్రక్రియలో వినియోగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. 5 నగరాల్లో 100 విద్యుత్ చార్జింగ్ యూనిట్లు నెలకొల్పనున్నట్లు తెలిపారు. 400 ఎలక్ట్రికల్ బస్సులు కూడా రాష్ట్రానికి వస్తాయన్నారు. భవిష్యత్తులో ఎలక్ట్రికల్ సైకిళ్లు, మూడు చక్రాల వాహనాలు వినియోగంలోకి వస్తాయన్నారు. తక్కువ ఖర్చుతో వీటిని నడపవచ్చని, 50 శాతం పచ్చదనం, ప్రకృతి వ్యవసాయం వంటి చర్యల ద్వారా వాతావరణంలో ఆక్సిజన్ పెరుగుతుందన్నారు. అమరావతిలో సీఆర్‌డీఏ వీటన్నింటినీ అమలు చేస్తోందన్నారు. పర్యావరణ హితమైన రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతున్నామన్నారు. భారత్ ఫోర్జ్, అశోక్ లేలాండ్, తదితర ప్రముఖ ఆటో రంగ సంస్థలతో ఏపీ ఆటోమొబైల్ హబ్‌గా మారిందన్నారు. రానున్న కాలంలో సౌర వ్యవస్థతో పని చేయనున్నామన్నారు. భవిష్యత్తులో సౌర విద్యుత్ యూనిట్ రూపాయికే లభ్యం కావచ్చన్నారు. ఆ దిశగా ఏపీ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. వాతావరణ కాలుష్య రహితంగా మార్చేందుకు భారీగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. 180 దేశాలకు విస్తరించి, 33 వేల మందికి ఉపాధి కల్పిస్తున్న కియా మోటార్స్ ఇక్కడ నెలకొల్పిన యూనిట్ అత్యుత్తమంగా రూపొందుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వంద శాతం నైపుణ్యత కలిగిన, నైపుణ్యత లేని కార్మికులు కూడా లభిస్తాన్నారు. ఉద్యోగితకు అర్హత ఉన్న వారి విషయంలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని చంద్రబాబు తెలిపారు. ఆటోమొబైల్ రంగానికి సంబంధించి కూడా పాలసీని, ఎలక్ట్రికల్ మొబిలిటీ పాలసీని రూపొందించామని గుర్తు చేశారు. రాష్ట్రంలో 14 ఆకర్షణీయ పట్టణాలు, నగరాల్లో పర్యావరణ హితమైన ఆధునిక రవాణా వ్యవస్థ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అంతకుముందు కియా మోటార్స్ ఎండీ కూక్యూ షిమ్ మాట్లాడుతూ అనంతపురంలో తమ ప్లాంట్ నుంచి మొదటి మోడల్ కారును 2019లో బయటకు వస్తుందన్నారు. ఏటా 3 లక్షల కార్లు తయారవుతాయని, ప్లాంట్ నిర్మాణానికి 1.1 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతున్నట్లు తెలిపారు. తమ సంస్థ 10 వేల మందికి ఉపాధి కల్పిస్తుందన్నారు. ఏపీ ప్రభుత్వం భవిష్యత్‌పై దృష్టి పెట్టే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని, అటువంటి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. నూతన టెక్నాలజీలో కియా ఒక భాగంగా పేర్కొన్నారు. వాహనాల వినియోగంలో భారత వినియోగదారుల మార్పు వస్తోందన్నారు. అవగాహనా ఒప్పందంపై కియా సీఈవో షిమ్, ఏపీఐఐసీ ఎండీ బాబు అహ్మద్ సంతకాలు చేశారు.
చిత్రం..కార్యక్రమంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు