రాష్ట్రీయం

అంతటా కేసీఆర్ ప్రభంజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ టౌన్, డిసెంబర్ 8: రాష్టమ్రంతటా అపద్ధర్మ సిఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రభంజనం ఉందని, తాను 25వేల నుండి 30వేల ఓట్ల మెజారిటితో గెలుపొందుతానని తెలంగాణ రాష్ట్ర సమితి మిర్యాలగూడ నియోజకవర్గ అభ్యర్ధి నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు.
శనివారం ఆయనింట్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ పార్టీకి చెందిన మండల, జిల్లా, రాష్ట్ర బాధ్యులు తమ పార్టీగా గుర్తించి కెసిఆర్ తిరిగి సిఎం కావాలన్న ఉద్దేశ్యంతో తీవ్రంగా కష్టపడ్డారన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో 84.69 శాతం ఓట్లు వచ్చాయంటే పోలింగ్‌కు కార్యకర్తలు నాయకులు అహర్నిశల కృషియేనని పేర్కొన్నారు.
తాము గత నాలుగున్నరేళ్లుగా ప్రజల సంక్షేమ, అభివృద్ధి పధకాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లామని, దాని ఫలితంగానే నేడు 1,76,000 ఓట్లు పోలయ్యాయన్నారు. కెసిఆర్ తిరిగి సిఎం అయితేనే అభివృద్ది జరుగుతుందని ప్రజలు ఆశించి ఓట్లు వేశారన్నారు. మిర్యాలగూడలో తాను గెలుస్తున్నానని, గులాబి జెండా ఎగురవేయడం ఖాయమని పేర్కొన్నారు. ఇందుకు ఇప్పటివరకు సహకరించిన ప్రజలకు కృతఙ్ఞతలు తెలిపారు.
సమావేశంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, నాయకులు తిరునగరు భార్గవ్, చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, జొన్నలగడ్డ రంగారెడ్డి, చిలుకూరి సత్యనారాయణ, నామిరెడ్డి కరుణాకర్‌రెడ్డి, నారాయణరెడ్డి, మునిసిపల్ వైస్ చైర్మన్ మగ్దుంపాషా, ఎంపిపి నూకల సరళ హనుమంతరెడ్డి, వేములపల్లి జడ్పిటిసి ఇ.పద్మ, మార్కెట్ కమిటి చైర్మన్ డి.చిట్టిబాబు, వైస్ చైర్మన్ ఎడవెళ్లి శ్రీనివాస్‌రెడ్డి, పెద్దిశ్రీనివాస్‌గౌడ్, వీరకోటిరెడ్డిలు పాల్గొన్నారు.