రాష్ట్రీయం

కూర్మావతారంలో భద్రాద్రి రామయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, డిసెంబర్ 9: వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగం గా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆదివారం భక్తులకు కూర్మావతారంలో దర్శనమిచ్చారు. ఈ రూపంలోస్వామివారిని చూసి భక్తులు పులకించిపోయారు. ఆలయంలో తొలుత ప్రత్యేక పూజలు నిర్వహించి నాళాయర దివ్యప్రబంధం చదివారు. మేళతాళాలు, మహిళల కోలాటాల నడుమ స్వామిని మిథిలా మండపానికి తీసుకొచ్చి భక్తుల దర్శనార్థం ఉంచారు. భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాల్లో దశావతారాల్లో భాగంగా స్వామివారు సోమవారం వరాహావతారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

చిత్రం..కూర్మావతారంలో భద్రాద్రి రామయ్య