రాష్ట్రీయం

అభిమానుల మధ్య జగన్ పాదయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం (రూరల్), డిసెంబర్ 9: వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి ప్రజా సంకల్ప యాత్ర ఆదివారం శ్రీకాకుళం రూరల్ మండలంలో మహిళలు, అభిమానులు, పార్టీ శ్రేణుల మధ్య కొనసాగింది. నగర శివారులోని అయ్యప్ప స్వామి ఆలయం నుండి ప్రారంభమైన పాదయాత్ర కొత్తరోడ్ జంక్షన్ మీదుగా పాలకొండ రోడ్‌లో రాగోలు సమీపంలోని దూసి రోడ్ వరకు కొనసాగింది. మార్గమధ్యలో ఎక్కడా ప్రసంగించడం, ఆగిన సంఘటనలు లేవు. మహిళలను, విద్యార్థులను, చిన్నారులను మాత్రమే దగ్గరకు తీసుకొని ముద్దాడడం, సెల్ఫీలు దిగడం కన్పించింది. మార్గమధ్యలో సమస్యలపై వినతిపత్రాలను జగన్ స్వీకరించారు. జగన్ పాదయాత్రలో మాజీ మంత్రి, వైసీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ ధర్మాన ప్రసాదరావు, రెడ్డి శాంతి, ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి, పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

చిత్రం..మహిళలతో కలిసి పాదయాత్ర చేస్తున్న జగన్