రాష్ట్రీయం

త్యాగమయి సోనియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 9: ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల కలను సాకారం చేసిన మహనీయురాలు సోనియాగాంధీ అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కొనియాడారు. ప్రధాన మంత్రి వంటి అత్యున్నత పదవిని సైతం తృణప్రాయంగా తోసిపుచ్చిన త్యాగమూర్తి అని అన్నారు. గాంధీభవన్‌లో ఆదివారం సోనియాగాంధీ జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ దివంగత నేతలు ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీల ఆశయసాధన కోసం సోనియాగాంధీ రాజకీయాల్లోకి వచ్చారన్నారు. యుపీఏ చైర్‌పర్సన్‌గా సోనియాగాంధీ చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారన్నారు. గ్రామీణ ప్రాంత పేదల ఉపాధి కోసం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది కూడా ఆమేనని అన్నారు. ఆహార భద్రతా చట్టం, ప్రభుత్వంలో పాదర్శకత, జవాబుదారి తనం కోసం సమాచార హక్కు చట్టం వంటి విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్న సోనియాగాంధీ కృషిని మరువలేమన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం సుదీర్ఘకాలం పోరాటం చేసిన ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన సోనియాగాంధీ ఈ ప్రాంత ప్రజల హృదయాల్లో దేవతగా నిలిచిపోయారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

చిత్రం..సోనియా జన్మదినం సందర్భంగా గాంధీభవన్‌లో కేక్ కట్ చేస్తున్న ఉత్తమ్, వీహెచ్ తదితరులు