రాష్ట్రీయం

దేశంలో బీజేపీ వ్యతిరేక పవనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 11: దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, అందుకు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలే నిదర్శనమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. గత ఐదేళ్లుగా అనేక ఉప ఎన్నికల్లో ఓటమి పాలవ్వటమే కాక తాజా ఎన్నికల్లో పరాజయం పొందటం వల్ల బీజేపీ బలహీనపడిందని అన్నారు. ఎన్డీఏ పాలన పట్ల అన్నివర్గాల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని, గత ఐదేళ్లలో బీజేపీ చేసిందేమీలేదని దేశవ్యాప్తంగా ప్రజలు గుర్తించారని అన్నారు. అందుకే ప్రత్యామ్నాయం వైపు మొగ్గుచూపుతున్నారని బీజేపీకి వ్యతిరేకంగా తాము చేస్తున్న పోరాటానికి ప్రజలు అండగా ఉన్నారని స్పష్టం చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి బలమైన ప్రత్యామ్నాయం ఏర్పాటుకు ఈ ఫలితాలు దోహదపడతాయన్నారు. తెలంగాణలో ప్రజాతీర్పును గౌరవిస్తామని, ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు ఐదు రాష్ట్రాల్లో విజయం సాధించిన వారందరికీ అభినందనలు తెలిపారు.