రాష్ట్రీయం

మంత్రి తుమ్మలకు షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, డిసెంబర్ 11: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగాను, సీనియర్ మంత్రిగాను పేరున్న తుమ్మల నాగేశ్వరరావు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. పాలేరు నియోజకవర్గంలో పోటీచేసిన ఆయన కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్‌రెడ్డి చేతిలో 7,669ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. కరవుతో అల్లాడిన పాలేరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన దేశంలోనే అత్యంత వేగంగా పాలేరు రిజర్వాయర్‌పై భక్తరామదాసు ప్రాజెక్టును నిర్మించారు. కానీ పాలేరు నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థిగా తొలిసారి పోటీచేసిన కందాల ఉపేందర్‌రెడ్డికి మద్దతు పలికారు. నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో కేవలం తిరుమలాయపాలెం మండలంలో మినహా మిగిలిన మూడు మండలాలైన కూసుమంచి, ఖమ్మం రూరల్, నేలకొండపల్లి మండలాల్లో తుమ్మల నాగేశ్వరరావుకు ఎక్కువ మంది ప్రజల నుంచి తిరస్కరణ ఎదురైంది.