రాష్ట్రీయం
శాసనసభకు ఎన్నికైన ఎంపీ, ఎమ్మెల్సీలు రాజీనామా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 14 December 2018
హైదరాబాద్, డిసెంబర్ 13: ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పదవులకు రాజీనామా చేశారు. ఇద్దరు ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్సీలు పదవులకు రాజీనామా సమర్పించారు. మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచారు.
పెద్దపల్లి లోక్సభ సభ్యుడు బాల్క సుమన్ చెన్నూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే ఎమ్మెల్సీలుగా ఉన్న మైనంపల్లి హనుమంతరావు, పట్నం నరేందర్రెడ్డి శాసనసభకు ఎన్నికయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో మైనంపల్లి మల్కాజ్గిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. నరేందర్రెడ్డి కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. టీఆర్ఎస్కు చెందిన వీరంతా ఎమ్మెల్యేలుగా ఎన్నికకావడంతో ఎంపీ, ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు.