రాష్ట్రీయం

ఎందుకింత జాప్యం?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 15: కోటి ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం ప్రతిపాదించిన నీటిపారుదల ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల జాప్యంపై ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన తొలిసారి అధికారులతో ప్రగతి భవన్‌లో సమావేశమై నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణ స్థితిగతులపై సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుల పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ, సీఎస్ ఎస్‌కే జోషి, ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, ఎంపీ వినోద్, నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్, ఇతర ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. పాలమూరు- రంగారెడ్డి, కాళేశ్వరం, సీతారామ, డిండి వంటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన మరింత వేగంగా పూర్తి చేయాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు మార్గదర్శనం చేశారు. ప్రాజెక్టులకు సంబంధించిన వర్కు ఏజన్సీలతో, సంబంధిత అధికారులతో మాట్లాడి సత్వరం పనులు
పూర్తి చేయాలన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం కోసం సేకరించిన భూములకు సంబంధించి పరిహారం వెంటనే చెల్లించాలని ఆదేశించారు. ఇందుకోసం అవసరమైన నిధులను వెంటనే విడుదల చేయాలని ఆర్ధిక శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. ప్రాజెక్టుల నిర్మాణాన్ని స్వయంగా పరిశీలించేందుకు తానే స్వయంగా రెండు రోజుల పాటు వస్తానని చెప్పారు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న మేటిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలన, పంప్ హౌస్‌లను సీఎం మంగళవారం నాడు సందర్శిస్తారు. అనంతరం మరో రోజు ఎస్‌ఆర్‌ఎస్పీ పునరుజ్జీవన పథకం కింద చేపట్టిన పనులను పరిశీలించనున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం సేకరించిన భూములకు తక్షణం పరిహారం చెల్లించాలని అన్నారు. గంధమల్ల, బస్వాపురం రిజర్వాయిర్ల భూ నిర్వాసితులకు చెల్లించడానికి 80 కోట్లు విడుదల చేయాలని ఆర్ధిక శాఖను సీఎం కోరారు. భూపాలపల్లి , నిర్మల్, పెద్దపల్లి, భువనగిరి జిల్లాల కలెక్టర్లకు కూడా వెంటనే పరిహారానికి సంబంధించిన నిధులు విడుదల చేయాలని అన్నారు. ఎస్‌ఆర్‌ఎస్‌ఫీ పునరుజ్జీవన పథకం ద్వారా చేపట్టిన పనుల వల్ల వరద కాల్వల్లో నీటి లభ్యత ఎక్కువగా ఉందని, ఫ్లడ్ ఫ్లో కెనాల్ నుండి ఆఫ్ టేక్ తూముల ద్వారా అన్ని చెరువులకు నీరు అందించాలని అన్నారు. కాకతీయ కెనాల్, ఫ్లడ్ కెనాల్ మధ్య ఉన్న ఆయకట్టు అంతా నీరు అందించేలా, ఆ ప్రాంతంలోని అన్ని చెరువులకు నింపాలని సూచించారు. తెలంగాణలో ఎక్కువ భూభాగానికి నీరు అందించే కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో మరింత వేగం పెరగాలని, వచ్చే జూన్, జూలై నాటికి నీరు అందించాలని అన్నారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం అనుకున్నంత వేగంగా జరగడం లేదని, మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, పంప్‌హౌస్‌ల నిర్మాణాల్లో వేగం పెరగాలని సీఎం ఆదేశించారు.
కాళేశ్వరం పనుల్లో జాప్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని హెచ్చరించారు. పనులను ప్రత్యక్షంగా చూసేందుకు వచ్చే మంగళవారం నాడు ప్రాజెక్టు వద్దకు వస్తానని అధికారులకు చెప్పారు.
సింగూరుకు రెండు ఎత్తిపోతల పథకాలు నిర్మించి నారాయణ్‌ఖేడ్ నియోజకవర్గానికి లక్ష, జహీరాబాద్ నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీరు అందించాలని, దీనికి సంబంధించిన ప్రతిపాదనలను వెంటనే సిద్ధం చేయాలని అన్నారు. కౌలాస్ నాలాను పటిష్టం చేయడంతో పాటు నాగమడుగు పనులు చేయడం ద్వారా జుక్కల్ నియోజకవర్గానికి సాగునీరు అందించాలని అన్నారు. మహారాష్ట్ర అధికారులతో మాట్లాడి లెండి ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు.
సీతారామ ఎత్తిపోతల పథకంతో పాటు శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకం, దేవాదుల ప్రాజెక్టు పనులు అనుకున్నంత వేగంగా జరగడం లేదని సీఎం అసంతృప్తి , ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. సీతారామ ఎత్తిపోతల పథకానికి అవసరమైన 11వేల కోట్ల నిధులు సేకరణ కూడా పూర్తయిందని, పనుల్లో ఏ మాత్రం జాప్యం, నిర్లక్ష్యం వహించవద్దని సీఎం అన్నారు. వర్కు ఏజన్సీల బాధ్యులతో సీఎం స్వయంగా మాట్లాడారు. ఎస్‌ఆర్‌ఎస్‌పీ పునరుజ్జీవ పథకం పనులను మే నాటికి పూర్తి చేస్తామని వర్కు ఏజన్సీలు సీఎంకు మాటిచ్చాయి. పాలమూరు- రంగారెడ్డి, సీతారామ, దేవాదుల ప్రాజెక్టులపై కూడా త్వరలో మరోసారి విస్తృతస్థాయిలో సమీక్ష నిర్వహించాలని సీఎం నిర్ణయించారు.

చిత్రం..ప్రాజెక్టులపై సమీక్ష జరుపుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్