రాష్ట్రీయం

లోక్‌సభ ఎన్నికలకు సమాయత్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 15: తెలంగాణలో బీజేపీని రానున్న రోజుల్లో మరింత పటిష్టం చేస్తామని, లోక్‌సభ ఎన్నికలకు పూర్తిస్థాయిలో సమాయత్తం అవుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ చెప్పారు. ఈ నెల 24న పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణకు వస్తారని, పార్టీలో సమీక్ష జరుగుతుందని అన్నారు. జనవరిలో ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రాన్ని సందర్శిస్తారని పేర్కొన్నారు. శనివారం నాడు ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడారు. 2019లో నరేంద్రమోదీని మరోసారి ప్రభుత్వంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. కేసీఆర్ వాపును చూసి బలుపు అనుకోని , బీజేపీకి 150 కన్నా ఎక్కువ ఎంపీ సీట్లు రావని, కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉండి, తెలంగాణకు చేసింది ఏమిటో ప్రజలకు తెలుసని చెప్పారు. క్ష్లస్టర్లు వారీ 24వ తేదీన అమిత్ షా విశే్లషణ చేస్తారని చెప్పారు. బీజేపీ ఓట్లు మాత్రమే జాబితాల నుండి గల్లంతు అయ్యాయని, వాటిపై విశే్లషణ చేస్తున్నామని అన్నారు. టీఆర్‌ఎస్ పార్టీలో కుమార పట్ట్భాషేకం, ఇపుడిపుడే అయిందని కొన్ని రోజుల తర్వాత ప్రభుత్వం తీరుపై స్పందిస్తామని చెప్పారు. ఈవీఎంల సాంకేతికతపై తమ అభ్యర్ధులకు కూడా కొన్ని అనుమానాలున్నాయని, దానిపై కమిటీ వేసి చర్చిస్తామని చెప్పారు. టీఆర్‌ఎస్ పార్టీ ఒంటెద్దు పోకడలకు వెళ్తె ప్రజలు తిరగబడతారని, సెంటిమెంట్‌తో టీఆర్‌ఎస్ గట్టెక్కిందని గుర్తించాలని పేర్కొన్నారు. బీజేపీ ఓటమికి సమిష్టి బాధ్యత ఉందని, ప్రధాని స్వయంగా తెలంగాణలో ప్రజలకు బీజేపీ పట్ల ఎంతో ప్రేమ ఉందని చెప్పారని, కానీ ఓట్లు రాకపోవడంపై సమీక్ష జరుపుతామని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో వచ్చిన దానికన్నా ఎక్కువ సెంటిమెంట్ ఈసారి వచ్చిందని తమకు రావల్సిన ఓట్లు కూడా టీఆర్‌ఎస్‌కు వెళ్లాయని చెప్పారు. మోదీ అవినీతి రహిత పాలన చూసి బురదజల్లే కార్యక్రమాన్ని ప్రతిపక్షాలు చేస్తున్నాయని, సైనికుల స్థైర్యం దెబ్బతినే రీతిలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని అన్నారు. రాఫెల్ డీల్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీకి కనువిప్పు కలగాలని లక్ష్మణ్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పుతోనైనా కాంగ్రెస్ పార్టీ తమ దుష్ప్రచారాన్ని మానుకోవాలని చెప్పారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ, బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం నాలుగున్నరేళ్లలో అవినీతి మచ్చపడకుండా పారదర్శకంగా పాలన కొనసాగిస్తోందని అన్నారు.అధికారం కోసం తరచూ తప్పుడు ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ తమ తప్పును ఒప్పుకుని క్షమాపణ చెప్పాలని అన్నారు. బీజేపీ కేంద్ర నాయకత్వం ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సమీక్ష నిర్వహించిందని అన్నారు. 2019లో ఎన్నికలు పూర్తయ్యేంత వరకూ విరామం లేకుండా బీజేపీ అనుబంధ సంస్థలు , మోర్చాలూ ప్రజలతో మమేకం కావాలని జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పిలుపునిచ్చారని అన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అమిత్ షా సూచించారని చెప్పారు. పార్టీని బలోపేతం చేసి , ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడంపై దృష్టి పెడతామని చెప్పారు. జనవరి 11,12 తేదీల్లో ఢిల్లీలో జరిగే జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో వ్యూహాన్ని రూపొందిస్తామని, తెలంగాణలోని 14 పార్లమెంటు స్థానాలను సాధించేందుకు సమీక్ష చేస్తామని పేర్కొన్నారు. డిసెంబర్ 15 నుండి అన్ని మోర్చాల సమావేశాలు జాతీయ స్థాయిలో జరుగుతాయని చెప్పారు.
చిత్రం..బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్