రాష్ట్రీయం

భద్రాద్రికి ముక్కోటి శోభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలం ముక్కోటి శోభను సంతరించుకుంది. రామాలయం విద్యుద్దీపాల వెలుగులతో దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. ఆదివారం అధ్యయనోత్సవాల్లో భాగంగా స్వామివారు శ్రీకృష్ణావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సోమవారం నిర్వహించే తెప్పోత్సవానికి గోదావరి తీరాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. మంగళవారం తెల్లవారుజామున ఉత్తరద్వారంలో స్వామి మహావిష్ణువు అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈసందర్భంగా దేవస్థానం ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లను ఇప్పటికే జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ, సబ్ కలెక్టర్ భవేశ్ మిశ్రా పరిశీలించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుం డా చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర నుంచి భక్తులు రానుండటంతో అందుకు తగిన ఏర్పాట్లు పూర్తిచేశారు.

చిత్రం..దేదీప్యమానంగా వెలుగొందుతున్న రామాలయం