రాష్ట్రీయం

డ్రగ్స్ మాఫియాపై ఎన్ని కేసులు పెట్టారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 20: డ్రగ్స్ మాఫియాపై ఎన్ని కేసులు పెట్టారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆదివారం అసెంబ్లీ సమావేశంలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చ సందర్భంగా రాజాసింగ్ మాట్లాడుతూ డ్రగ్స్ మాఫియాలో కొంత మంది సెలబ్రిటీలూ ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నదని అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టిందో ప్రకటించకుండా, కేసును మూసి వేశారని ఆయన విమర్శించారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని ధూల్‌పేటలో గుడుంబా తయారు చేస్తున్న వారికి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు చూపించాలని ఆయన డిమాండ్ చేశారు. ధూల్‌పేట ప్రాంతాన్ని సందర్శిస్తానని లోగడ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారని ఆయన గుర్తు చేశారు. ధూల్‌పేట వాసులను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి వద్దకు వెళతామని తాను లోగడ ఎక్సైజ్ శాఖ మంత్రిని అడగ్గా, ముఖ్యమంత్రి తనకే సమయం ఇవ్వడం లేదని, ఇక మీకు ఎలా ఇస్తారని ఎదురు ప్రశ్నించారని ఆయన గుర్తు చేశారు. సభలో ఉన్న మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు ఏదో చెప్పడానికి ప్రయత్నించగా, కేసీఆర్ వద్దంటూ సైగ చేశారు.