రాష్ట్రీయం

జనసేనలో చేరిన ఆకుల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ): ఎమ్మెల్యే ఆకుల సత్యనానారాయణ చేరికతో జనసేన పార్టీకి నవ జవసత్వాలు వచ్చాయని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. పార్టీకి మరింత బలం తెచ్చిన ఆకులకు ఎల్లవేళలా అండగా ఉంటానని చెప్పారు. రాజమండ్రి అర్బన్ బీజేపీ శాసన సభ్యుడు డాక్టర్ ఆకుల సత్యనారాయణ, ఆయన సతీమణి ఆకుల లక్ష్మీ పద్మావతి సోమవారం పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. విజయవాడలోని ప్రైవేటు కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సత్యనారాయణను మనస్ఫూర్తిగా పార్టీలోనికి ఆహ్వానిస్తునట్లు తెలిపారు.
తూర్పు గోదావరి జిల్లాలో ఆకుల సత్యనారాయణ కుటుంబానికి ప్రత్యేక గౌరవం ఉందని, అటువంటి కుటుంబం జనసేనలో చేరడంతో పార్టీ మరింత బలోపేతమయిందన్నారు. 2014 ఎన్నికల సమయంలో పొత్తులో భాగంగా తాను ఆకుల సత్యనారాయణకు మద్దతు ఇచ్చానన్నారు. వారి కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటూ ప్రోత్సహిస్తుందన్నారు. జనసేన పార్టీలోకి చేరిన ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ పార్టీ అధ్యక్షుడు ఎక్కడి నుండి పోటీ చేయమంటే అక్కడి నుండి పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. నేటి కుళ్లిపోయిన రాజకీయ వ్యవస్థలను ప్రక్షాళన చేయడం పవన్ కళ్యాణ్‌కే సాధ్యమని అభిప్రాయపడ్డారు. సంక్షేమ పథకాల్లో అవినీతి రాజ్యమేలుతుందని, అవినీతికి తావులేని పరిపాలన పవన్ కళ్యాణ్ అందిస్తారనే నమ్మకం ఉందన్నారు. తమ స్వార్థ రాజకీయాలు, ఓటు బ్యాంకు కోసం కొంత మంది నాయకులు కులాల మధ్య అంతరాలు పెంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు అతీతంగా పవన్ మాత్రమే అలోచిస్తున్నారని, సమర్థమైన, పారదర్శకమైన పాలన జనసేనతోనే సాధ్యమని నమ్మి పార్టీలో చేరినట్లు ఆకుల సత్యనారాయణ స్పష్టం చేశారు. 2014 ఎన్నికల్లో రాజమండ్రి అర్బన్ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన ఆకుల సత్యనారాయణ ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. సుమారు 300 కార్లు వెయ్యిమంది జనసేన కార్యకర్తలు, అభిమానులతో కలిసి ఆయన భారీ ర్యాలీగా విజయవాడ చేరుకున్నారు.
మత్స్యకార సంఘం నేత నాయకర్ చేరిక
అలాగే పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గానికి చెందిన మత్య్సకార సంఘం నేత బొమ్మిడి నాయకర్ తన అనుచరులతో జనసేన పార్టీలోకి పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరారు. ఉభయగోదావరి జిల్లాల అగ్నికుల క్షత్రియ సంఘం నేతగా నాయకర్ 2009 నుంచి నరసాపురం నియోజకవర్గంలో టీడీపీలో కీలక నేతగా ఉన్నారు.

చిత్రం..రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణకు జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న పవన్ కళ్యాణ్