రాష్ట్రీయం

తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: తిరుమలలో సోమవారం రాత్రి 7 గంటలకు పౌర్ణమి గరుడ సేవ అత్యంత వైభవంగా జరిగింది. శ్రీ మలయప్పస్వామి వారు తన ఇష్టవాహనమైన సువర్ణ గరుత్మంతునిపై విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. ప్రతి నెలా పౌర్ణమి సందర్భంగా గరుడసేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. కాగా గరుడ సేవ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తిరుమల నాలుగు మాడ వీధుల గోవిందనామ స్మరణలతో మార్మోగాయి. శ్రీ మలయప్ప స్వామి వారు గరుడ వాహనంపై తిరుమాడ వీధులలో నింపాదిగా ఊరేగుతూ భక్తులందరినీ కటాక్షించారు. ఈ కార్యక్రమంలో తిరుమల జేఈఓ శ్రీనివాస రాజు, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈఓ హరీంధ్రనాథ్, ఎస్‌ఈ రామచంద్రా రెడ్డి, విఎస్వో మనోహర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
చిత్రం..తిరుమల మాడ వీధుల్లో స్వర్ణ శోభిత గరుడ వాహనంపై విహరిస్తూ
భక్తులను కటాక్షిస్తున్న మలయప్పస్వామి