రాష్ట్రీయం

త్వరలో కొత్త ఎమ్మెల్యే క్వార్టర్స్‌ను ప్రారంభిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 22: రాష్ట్ర ఎమ్మెల్యేల కోసం కొత్తగా నిర్మించిన క్వార్టర్స్ (అపార్టుమెంట్ల)ను ప్రారంభిస్తామని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 4.5 ఎకరాల్లో అత్యాధునిక పద్ధతిలో 120 మంది ఎమ్మెల్యేలకు సరిపోయేలా క్వార్టర్స్ నిర్మించినట్లు ఆయన చెప్పారు. స్పీకర్ పోచారం, శాసనమండలి కార్యదర్శి వీ. నరసింహాచార్యులు మంగళవారం హైదర్‌గుడాలోని క్వార్టర్స్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా పోచారం తనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ ఒక్కో ఫ్లాట్ 2,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నట్లు చెప్పారు. క్వార్టర్ల కేటాయింపు కోసం కమిటీని నియమించి, నియమ, నిబంధనలు విధించనున్నట్లు ఆయన వివరించారు. వాహనాల పార్కింగ్‌కు 3 సెల్లార్లను నిర్మించామని, ఒకేసారి 200 వాహనాలు నిలిపేలా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. క్వార్టర్స్ నిర్మాణానికి రూ.166 కోట్లు ఖర్చు చేసినట్లు ఆయన చెప్పారు.
చిత్రం..మంగళవారం హైదర్‌గూడలో ఎమ్మెల్యేల కోసం
కొత్తగా నిర్మించిన క్వార్టర్స్‌ను సందర్శించిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి