రాష్ట్రీయం

ఎస్పీ బాలుకు మాతృవియోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఫిబ్రవరి 4 : ప్రఖ్యాత సినీ నేపద్య గాయకులు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంకు మాతృ వియోగం కలిగింది. నెల్లూరు నగరంలోని తిప్పరాజు వారి వీధిలో నివాసం ఉంటున్న బాలు తల్లి శకుంతలమ్మ(90) అనారోగ్యంతో సోమవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో మృతిచెందారు. ఆమె వయోభారంతో గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కుమారుడు బాలసుబ్రహ్మణ్యం వృత్తిరీత్యా చెన్నైలో ఉంటున్నారు. తల్లి మాత్రం తమ స్వస్థలమైన నెల్లూరులోని తిప్పరాజువారి వీధిలో గల స్వగృహంలో ఉంటున్నారు. ఎస్పీ బాలు ప్రస్తుతం లండన్‌లో ఉన్నారు. తల్లి మరణ వార్త తెలుసుకున్న బాలు బయలుదేరినట్టు ఆయన కార్యాలయ వర్గాలు తెలిపాయి.