రాష్ట్రీయం

ఏప్రిల్ 22 నుంచి శ్రీ వరాహస్వామివారి బాలాలయ మహాకుంభాభిషేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఫిబ్రవరి 16: తిరుమలలోని శ్రీ వరాహస్వామివారి ఆలయ అష్టబంధన బాలాలయ మహాకుంభాభిషేకాన్ని ఏప్రిల్ 22 నుంచి 27వ తేదీ వరకు వైభవంగా నిర్వహించాలని టీటీడీ ఆగమ సలహామండలి నిర్ణయించింది. శనివారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో శనివారం టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ అధ్యక్షతన ఆగమ సలహామండలి సమావేశం జరిగింది. తిరుమల జేఈఓ శ్రీనివాస రాజు, టీటీడీ వైఖానస ఆగమ సలహదారులు ఎన్ ఏ కె సుందరవదనాచార్యులు, ఎ వేణుగోపాల దీక్షితులు, ఎన్ వి మోహనరంగాచార్యులు, ఎ టి అనంత దీక్షితులు, పిఎస్‌ఎస్‌ఆర్ జగన్నాథాచార్యులు ఈ సమావేశంలో పాల్గొని పలు సూచనలు చేశారు. ఇందులో తిరుమల శ్రీవారికి ఆలయంలో 2018, ఆగస్టు 11 నుంచి 16వ తేదీ వరకు జరిగిన అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ ఘట్టాన్ని గ్రంథస్థం చేయాలన్నారు.