రాష్ట్రీయం

బాబు పాత్రపై ఈడీ ఆరా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 20: ఓటుకు నోటు కేసులో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డిని రెండోరోజు బుధవారం విచారించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఏపీ సీఎం చంద్రబాబు పాత్రపై ఆరా తీసింది. మొత్తం వ్యవహారంలో చంద్రబాబు ప్రమేయంపై ఈడీ అధికారులు తరచితరచి ప్రశ్నించినట్టు తెలిసింది. ఏసీబీ అధికారులు దాఖలు చేసిన చార్జిషీట్‌లో ఏపీ సీఎం చంద్రబాబు పేరు ఉండడంతో ఆ దిశగా రేవంత్‌పై ప్రశ్నలు సంధించారు. రేవంత్‌రెడ్డి మంగళ, బుధవారాలు ఈడీ ఎదుట హాజరయ్యారు. ఏసీబీ దాఖలు చేసిన కేసులో చంద్రబాబు పేరును 20 సార్లు రికార్డు చేశారు. కాగా బుధవారం రేవంత్‌ను ఎనిమిది గంటలకుపైగా విచారించారు. వివిధ కోణాల్లో ఆయన నుంచి సమాచారం రాబట్టడానికి ప్రశ్నించారు. చంద్రబాబు దేని గురించి స్టీఫెన్‌సన్ దగ్గరకు పంపించారని ఈడీ అడిగింది. స్టీఫెన్‌సన్‌కు తొలుత రూ. 50 లక్షలు ఇవ్వడం, మిగతా రూ. 4.50 కోట్లు ఎవరి నుంచి నగదు తలిస్తున్న విషయాలపై రేవంత్‌ను ప్రశ్నించారు. ఇలా ఉండగా ఏపీ ఇంటిలిజెన్స్ అధికారులు సైతం ఈడీ అధికారుల ముందు హజరయ్యారు. 2015 ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా టీడీపీకి ఓటు వేయాలంటూ నామినేటెడ్ సభ్యుడు స్టీఫెన్‌సన్‌కు రూ. 50 లక్షలు రేవంత్ ఇవ్వచూపారు. ఈ కేసులో రేవంత్ ఏ-1 నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో చంద్రబాబుకి ఈడీ నోటీసులు ఇవ్వనున్నట్లు తెలిసింది.

చిత్రం.. ఈడీ విచారణకు హాజరై వెళ్తున్న రేవంత్‌రెడ్డి