రాష్ట్రీయం

పాకిస్తాన్‌ను సమర్థిస్తున్నారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఫిబ్రవరి 21: జమ్మూకాశ్మీర్‌లో జవాన్లపై ఉగ్రదాడిని దేశమంతా ఖండిస్తున్నారని, ఇలాంటి సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఉగ్రవాదాన్ని సమర్థిస్తున్నాడా? వారికి అండగా ఉన్న పాకిస్తాన్‌కు అండగా ఉంటున్నాడా? అన్న భావన కలుగుతోందని నగరి ఎమ్మెల్యే రోజా అన్నారు. గురువారం ఉదయం ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుని పీడిస్తోందన్నారు. ఉగ్రవాద ఘటనకు సంబంధించి ప్రధాని నరేంద్రమోదీని రాజీనామా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు డిమాండ్ చేయ డం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో గోదావరి పుష్కరాల్లో 30మంది ప్రాణాలు కోల్పోయినపుడు చంద్రబాబునాయుడు ఎందుకు రాజీనామా చేయలేదని ఆమె ప్రశ్నించారు. పోలీసుల చేతుల్లో రైతు మరణిస్తే ఎందుకు రాజీనామా చేయలేదని నిలదీశారు. చంద్రబాబునాయుడు అవకాశ రాజకీయాలకు పాల్పడుతారని మరోమారు తేటతెల్లమవుతోందన్నారు.