రాష్ట్రీయం

వైసీపీ ఓటమే కేసీఆర్‌కు రిటర్న్‌గిఫ్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), మార్చి 9: ఢిల్లీ మోదీ, హైదరాబాద్ మోదీ, లోటస్‌పాండ్ మోదీ, ఈ ముగ్గురు మోదీలు కుమ్మక్కై ఏపీపై అనేక కుట్రలు పన్నుతున్నారని టీడీపీ జాతయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో వైసీపీ ఓటమిని రిటర్న్‌గిఫ్ట్‌గా కేసీఆర్‌కు తప్పకుండా పంపిస్తానని ప్రకటించారు. హుందాగా రాజకీయాలు చేసే టీడీపీ వైపే అన్ని రాజకీయ కుంటుంబాలు చూస్తున్నాయన్నారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో శనివారం సాయంత్రం కర్నూలు జిల్లా పాణ్యం వైసీపీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి దంపతులు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే గౌరు చరిత దంపతులుకు పార్టీ కండువా కప్పిన చంద్రబాబు వారికి పార్టీలోనికి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మొన్న కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, నేడు గౌరు చరితా రెడ్డి, వెంకటరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారన్నారు. రాజకీయ కుంటుంబాలన్నీ టీడీపీలోకి చేరేందుకు ముందుకు వస్తున్నాయన్నారు. వీరందరి రాకతో కర్నూలులో తెలుగుదేశం మరింత బలపడిందని.. జిల్లాలో తెలుగుదేశం జయం తథ్యమన్నారు. ప్రతిపక్ష నేత జగన్ హైదరాబాద్‌లో కూర్చుని వైసీపీ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాజకీయం చేస్తే ఇక్కడ చేయాలి కానీ, తెలంగాణాలో ఉండి ఏపీ రాజకీయాలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. కేసీఆర్ పంచన చేరిన వైఎస్ జగన్ మనపై కక్ష సాధిస్తున్నారన్నారు. వేరే రాష్ట్రంలో ఉండి, ఈ రాష్ట్రంలో అభ్యర్థులను ఎంపిక చేస్తారా అని ప్రశ్నించారు. నాకు రిటర్న్‌గిఫ్ట్ ఇస్తానంటున్న కేసీఆర్.. జగన్‌కు పెట్టుబడులు పెట్టడమే నాకిచ్చే రిటర్న్‌గిఫ్టా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో వైసీపీ ఓటమిని తిరుగుటపాలో రిటర్న్‌గిఫ్ట్‌గా కేసీఆర్‌కు తప్పకుండా పంపిస్తానని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.

చిత్రం.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీలో చేరిన
కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి దంపతులు