రాష్ట్రీయం

తెరాసలోకి ఆరెపల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 17: కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులే కాకుండా ఆ పార్టీ ముఖ్యనేతలు కూడా టీఆర్‌ఎస్‌లో చేరడానికి క్యూ కటుడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఎస్సీ సెల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ ఆదివారం హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఆరెపల్లి మోహన్‌తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్‌లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు కూడా టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆరెపల్లి మోహన్ చేరికతో కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు. ఆరెపల్లి మోహన్ వంటి సీనియర్ నాయకులు టీఆర్‌ఎస్‌లోకి రావడాన్ని స్వాగతిస్తున్నామని, భవిష్యత్తులో ఆయనకు సముచిత గౌరవం దక్కుతుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థికి మంచి మెజారిటీ తీసుకరావడానికి కృషి చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు ప్రజల నమ్మకాన్ని కోల్పోతోందని ఆరెపల్లి మోహన్ అన్నారు.

చిత్రం..కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరిన మానకొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి