రాష్ట్రీయం

తెప్పపై కనువిందు చేసిన శ్రీవారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: తిరుమలలో శ్రీవారి తెప్పోత్సవాలలో భాగంగా రెండోరోజైన ఆదివారం రాత్రి పుష్కరిణిలో రుక్మిణీ సమేత శ్రీకృష్ణ స్వామివారు విహరిస్తూ భక్తులకు కనువిందు చేశారు. వివిధ రకాల పుష్పాలతో, విద్యుత్ దీపకాంతుల నడుమ, విశేషాలంకార భూషితుడైన స్వామి పుష్కరిణిలో మూడు చుట్లు విహరించారు. ఈ సందర్భంగా పుష్కరిణి ప్రాంతం భక్తుల గోవిందనామ స్మరణలతో మారుమోగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, జేఈఓ శ్రీనివాసరాజు, ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, చిన్నజీయర్ స్వామి, అర్చకులు, అధికారులు, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.