రాష్ట్రీయం

తెప్పపై విహరించిన మలయప్ప స్వామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మార్చి 18: తిరుమల శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలలో భాగంగా మూడో రోజైన సోమవారం శ్రీదేవి, భూదేవీ సమేత శ్రీ మలయప్ప స్వామివారు తెప్పలపై భక్తులను కటాక్షించారు. ముందుగా స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను శ్రీవారి ఆలయ నాలుగు మాడవీధుల్లో వైభవంగా ఊరేగించి పుష్కరిణి వద్దకు వేంచేపు చేశారు. రాత్రి 7 గంటల నుంచి విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై స్వామి, అమ్మవార్లు ఆశీనులై పుష్కరిణిలో మూడు చుట్లు విహరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, పేష్కేర్ రమేష్‌బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు.