రాష్ట్రీయం

16 లోక్‌సభ స్థానాల్లో టీఆర్‌ఎస్‌కే మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 23: రాష్ట్రంలోని 16 లోక్‌సభ స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులకే మా మద్దతు ఉంటుందని మజ్లీస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. చేవెళ్ళ లోక్‌సభ స్థానం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన జీ. రంజిత్ రెడ్డి శనివారం ఒవైసీని కలిసి తనకు మద్దతునివ్వాల్సిందిగా కోరారు. అందుకు ఓవైసీ సానుకూలంగా స్పందించారు. చేవెళ్ళలో తనకు పట్టు ఉన్నదని ఆయన తెలిపారు. సమావేశనంతరం రం జిత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అసదుద్దీన్ ఒవైసీ తనకు సంపూర్ణమైన ప్రకటించారని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులకు మద్దతునిస్తున్నట్లు చెప్పారని రంజిత్ రెడ్డి తెలిపారు. ఆయన వెంట పీ కార్తీక్ రెడ్డి కూడా ఉన్నారు.
చిత్రం.. మజ్లిస్ నేత అసదుద్దీన్