రాష్ట్రీయం
హంస వాహనంపై ఊరేగిన కోదండరాముడు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 15 April 2019
రాజంపేట, ఏప్రిల్ 14 : కడప జిల్లాలో వెలసిన ఒంటిమిట్ట శ్రీకోదండరాముడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి లక్ష్మణ సమేత శ్రీసీతారామచంద్రులు హంస వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. తొలుత స్వామివారికి ఊంజల్ సేవ నిర్వహించి అనంతరం స్వామివారు హంస వాహనంపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. ఆ తర్వాత స్వామివారికి ఏకాంతసేవ నిర్వహించారు. ఇక హంస వాహనంపై ఊరేగుతున్న శ్రీసీతారామలక్ష్మణులను చూసేందుకు భక్తులు పోటీ పడ్డారు. భక్తిపారవశ్యంతో స్వామివారిని దర్శించుకుని జన్మ ధన్యమైందని భక్తులులు భావిస్తున్నారు. స్వామివారి సేవలను చూసేందుకు ఒంటిమిట్టకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తుండడం విశేషం.
చిత్రం... హంస వాహనంపై దర్శనమిచ్చిన ఒంటిమిట్ట శ్రీరాముడు