రాష్ట్రీయం

కాళీయమర్దనుడిగా కోదండ రామయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజంపేట, ఏప్రిల్ 20: కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో జరుగుతున్న శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీరామచంద్రుడు శనివారం ఉదయం కాళీయమర్దన అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవమూర్తులను అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు, హారతులు ఇచ్చిన అనంతరం గ్రామోత్సవం నిర్వహించారు. కాళీయమర్దనుడిగా రమణీయంగా కనువిందు చేసిన స్వామిని చూసి భక్తజనం జయజయధ్వనాలు చేశారు. గ్రామోత్సవం ముందుభాగంలో భక్తజన బృందాలు, చెక్క్భజనలు, కోలాటాలతో కళాకారులు అలరించారు. ఆలయంలో ఉదయం సుప్రభాత సేవ నిర్వహించిన వేద పండితులు ఆలయ శుద్ధిచేసి ఆరాధన కార్యక్రమం నిర్వహించారు. తదుపరి భక్తులకు సర్వదర్శనం ఏర్పాటు చేశారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు శనివారం అధిక సంఖ్యలో తరలివచ్చారు. గ్రామోత్సవం అనంతరం ఉదయం 11 గం. నుండి 12 గం. వరకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. శ్రీరామచంద్రమూర్తి ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు. సాయంత్రం 5 గం. నుండి 6 గం. వరకు ఊంజల్‌సేవ జరిగింది. రాత్రి స్వామివారు అశ్వవాహనంపై ఊరేగారు. ఆదివారం ఉదయం చక్రస్నానం, సాయంత్రం ధ్వజావరోహణ కార్యక్రమం ఉంటుంది.