రాష్ట్రీయం

గులాబీ గూటికి గండ్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 22: కాంగ్రెస్ పార్టీ మరో వికెట్‌ను కోల్పోయింది. ఆ పార్టీకి చెందిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావును ఆయన కలిసి సంసిద్ధతను వ్యక్తం చేయగా ఆయన స్వాగతించారు. అలాగే భూపాలపల్లి డీసీసీ అధ్యక్షురాలిగా ఉన్న రమణారెడ్డి భార్య గండ్ర జ్యోతి కూడా కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు ప్రకటించారు. తన భర్త రమణారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకోవడంతో తాను కాంగ్రెస్‌లో కొనసాగడం భావ్యం కాదని రాజీనామా చేసినట్టు ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఆమె లేఖ పంపించారు. గండ్ర రమణారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు ప్రకటించడంతో పార్టీ మారే కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 11కు చేరుకుంది. కాంగ్రెస్‌కు చెందిన మరో ఎమ్మెల్యే టీఆర్‌ఎస్‌లో చేరితే శాసనసభలో ఆ పార్టీ ప్రతిపక్ష హోదా కోల్పోనుంది.